Category: About Me_Trending News
యూట్యూబ్లో రికార్డు సృష్టిస్తున్న సాంగ్
కొరియన్ పాప్ బ్యాండ్ బీటీఎస్ మొదటి ఇంగ్లీష్ సింగిల్ “డైనమైట్” ను శుక్రవారం విడుదల చేసింది. డైనమైట్ విడుదలయిన ఒక్కరోజులోనే అత్యధిక వీక్షణలు పొంది యూట్యూబ్లో రికార్డు సృష్టించింది. డైనమైట్ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విడుదలయ్యింది. అయితే శనివారం ఉదయం 6.05 గంటలకు వరకు ఈ వీడియోను 86.4 మిలియన్ల మంది చూశారు. అంతకుముందు కూడా మరొక కొరియా పాప్ బ్యాండ్ బ్లాక్పింక్ చేసిన ట్రాక్ “హౌ యు లైక్ దట్” కూడా 86.3 మిలియన్ల వీక్షణలతో రికార్డ్ను సృష్టించింది. శనివారం యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోలలో డైనమైట్ మొదటిస్థానంలో నిలిచింది. కేవలం ఇది మాత్రమే కాకండా డైనమైట్ అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఈ వీడియో 3 మిలియన్లకు పైగా ప్రత్యక్ష వీక్షకులతో అత్యధికంగా వీక్షించిన యూట్యూబ్ ప్రీమియర్గా రికార్డును సృష్టించింది. అయితే, కొరియా పాప్ బ్యాండ్ ఈ…
Read MoreExplosion at Beirut, the capital city of Lebanon on 05-08-2020
Here are some before and after pictures of Beirut port, Entire contry is dependent on this port for imports. The shockwave was so powerful that very far areas in Lebanon heard the noise, The sound of the explosion was even heard in Cyprus. After: Before: Another one: After Before గోడౌన్లో వెల్డింగ్ పనులతో మంటలు బీరూట్ : లెబనాన్ రాజధాని బీరూట్ను వణికించిన భారీ పేలుళ్లలో మృతుల సంఖ్య 100కు చేరింది. ఈ ఘటనలో నాలుగువేల మందికి పైగా గాయపడ్డారు. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. ఒక్కసారిగా భారీ పేలుళ్లతో జనం వణికిపోయారు. భయంతో ప్రజలు…
Read Moreగ్యాంగ్స్టర్ వికాస్ దూబే హతం
ఉత్తరప్రదేశ్లో 8 మంది పోలీసుల కాల్చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ అతడిని ఈరోజు ప్రత్యేక వాహనంలో కాన్పూర్కు తరలిస్తుండగా.. పోలీసుల ఎస్కార్ట్లోని ఆ వాహనం బోల్తా పడింది. దీనిని అదునుగా తీసుకున్న వికాస్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడిన అతడిని కాన్పూర్ ఆస్పత్రికి తరలించగా.. అతడు మరణించినట్లు తెలుస్తోంది. కాగా వికాస్ను పట్టుకునే క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలైనట్లు సమాచారం. ఎనిమిది మందిని పొట్టనబెట్టుకునిఉత్తరప్రదేశ్లో నేర సామ్రాజ్యం నిర్మించుకున్న వికాస్ దూబేను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడి అనుచరులు.. పోలీసులపై కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. గత గురువారం జరిగిన కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. ఈ క్రమంలో వికాస్…
Read Moreసరిహద్దు నుంచి యుద్ధ సందేశం
పెద్దనోట్ల రద్దు, ఆర్టికల్ 370 తొలగింపు (కశ్మీర్), లాక్డౌన్ విధింపు వంటి అనుహ్య నిర్ణయాలతో దేశ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి అదే పంథాను ఎంచుకున్నారు. భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో మూడోకంటికి కూడా తెలియకుండా కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లో పర్యటించి శుక్రవారం ఉదయం ఊహించని వార్తను దేశ ప్రజలకు వినిపించారు. ఎవరికీ ఎలాంటి సమాచారం లేకుండా సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జరనల్ ఎంఎమ్ నరవణేతో కలిసి మోదీ లేహ్ పర్యటనకు శ్రీకారం చుట్టారు. జూన్ 15న చోటుచేసుకున్న గల్వాన్ లోయ హింసాత్మక ఘటనలో గాయపడిన సైనిక జవాన్లను 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న భారత సైనిక స్థావరం నిములో పరామర్శించారు. అలాగే సరిహద్దు ప్రతిష్టంభనపై చైనా-భారత్ కమాండర్ స్థాయి సమావేశాల్లో పాల్గొన్న సైనిక అధికారులతో మోదీ ప్రత్యేకంగా…
Read Moreసూర్యగ్రహణం
ఆకాశంలో అద్భుత దృశ్యమైన సూర్యగ్రహణాల్లో ఒకటైన వార్షిక సూర్యగ్రహణం ఆదివారం భారత్లో కనిపించి కనువిందు చేయనుంది. ఈ సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి సుదూరంగా వెళ్లడంతో పూర్తిగా సూర్యుడ్ని కప్పి ఉంచలేడు. 70శాతం మాత్రమే కప్పివేయడంతో ఖగోళ అద్భుత దృశ్యాల్లో ఒకటైన రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా తీసుకుంటే సూర్యగ్రహణం ఉదయం గం.9:15 గంటలకు మొదలై మధ్యాహ్నం 12:10 గంటలకు అత్యున్నత స్థితికి చేరుకొని మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రాంతాలను బట్టి సమయంలో కాస్త మార్పులు ఉంటాయని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. గ్రహణం తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి 1.44 గంటల వరకు ఉంటుంది. 51 శాతం గ్రహణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉదయం 10.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం గ్రహణం ఉంటుంది.…
Read Moreఐరాస ఎన్నికల్లో భారత్ విజయం
ఐరాసలో భారత్కు తాత్కాలిక సభ్యదేశ హోదా 184 ఓట్లను గెలుచుకున్న భారత్ 2021 జనవరి 1 నుండి రెండేళ్లపాటు ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వపు ఎన్నికల్లో భారత్ విజయం సాధించింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి)లో భారత్కు మరోసారి తాత్కాలిక సభ్యదేశ హోదా లభించింది. దీంతో రెండేళ్లపాటు (2021–22) భారత్ కొనసాగనుంది. ఐరాసలో సభ్యదేశంగా భారత్ ఎంపిక కావడం ఇది ఎనిమిదోసారి. 55 మంది సభ్యులున్న ఆసియా–పసిఫిక్ గ్రూప్ నుంచి కేవలం భారత్ ఒక్కటే పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఐర్లాండ్, మెక్సికో, నార్వే కూడా భద్రతా మండలి ఎన్నికల్లో విజయం సాధించగా, కెనడా ఓటమిపాలైంది.
Read Moreవిషం చిమ్మిన చైనా..
తూర్పు లద్దాఖ్లో భారతీయ సైనికులపై రాళ్లు, రాడ్లతో దాడి అమరులైన 20 మంది భారతీయ సైనికులు ఎదురుదాడి చేసిన భారత సైన్యం చైనాకు భారీగా ప్రాణ నష్టం; 43 మంది మరణించినట్లు సమాచారం తప్పు భారత్దేనన్న చైనా; భారతీయ సైనికులే సరిహద్దు దాటారని వాదన న్యూఢిల్లీ: ఇండో–చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పు లద్దాఖ్లోని గాల్వన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య సోమవారం రాత్రి జరిగిన తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణల్లో రెండు దేశాలకు భారీగా ప్రాణ నష్టం జరిగింది. ముఖాముఖీ పోరాటంలో రాళ్లు, ఇనుప రాడ్లతో చైనా సైనికులు దాడి చేశారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వారి దాడిలో తెలుగువాడైన ఒక కల్నల్, ఇద్దరు జవాన్లు అమరులైనట్లు మొదట ఆర్మీ ప్రకటించింది. కానీ, ఘర్షణలు పెద్ద ఎత్తున జరిగాయని, భారీగా మోహరించిన రెండు…
Read Moreగాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ
భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోశ్ బాబు వీరమరణం పొందారు. ఆయనది తెలంగాణలోని సూర్యాపేట జిల్లా. అత్యంత ధైర్యవంతుడు, ప్రతిభావంతుడైన సంతోశ్ గురించి ఆయన తల్లిదండ్రులు కీలక వివరాలు తెలిపారు. తల్లిగా బాధగా ఉంది.. కానీ, నా కుమారుడు దేశం కోసం అమరుడైనందుకు గర్వంగా ఉంది.. గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలో అమరులైన కల్నల్ సంతోశ్ బాబు తల్లి మంజుల చెబుతోన్న మాట ఇది. ఒక్కగానొక్క కుమారుడు దేశం కోసం ప్రాణాలు కోల్పోయాడు. అయినా.. ఆ తల్లిదండ్రుల్లో ధైర్యం ఏమాత్రం చెక్కుచెదరలేదు. వారిలో ఆ జవాన్ నింపిన ధైర్యం అలాంటిది. ఇండియన్ ఆర్మీ పవర్ అలాంటిది. తనకు మరణం ఏ సమయంలో, ఏ రూపంలో వచ్చినా కుంగిపోవద్దని తల్లిదండ్రులకు, భార్యకు ధైర్యం నూరిపోశాడు. తన కుమారుడు ఇచ్చిన బలంతోనే ఆ…
Read Moreహీరో సుశాంత్ రాజ్పుత్ ఆత్మహత్య
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ (34) ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన ఇంట్లో ఆదివారం ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారో కారణాలు తెలియరాలేదు. కాగా గత ఆరు నెలలుగా సుశాంత్ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ‘కోయ్ పో చి’తో కెరీర్ను ఆరంభించిన సుశాంత్ ఆ తర్వాత ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘పీకే’, ‘డిటెక్టీవ్ బొమ్కేష్ బక్షి’, ‘ఎం.ఎస్.ధోనిః ద అన్టోల్డ్ స్టోరీ’, ‘రాబ్టా’, ‘వెల్కమ్ న్యూయార్క్’, ‘కేదార్నాథ్’, ‘సోంచారియా’, ‘చిచ్చోర్’, ‘డ్రైవ్’ తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఆయన చివరిగా నటించిన చిత్రం ‘దిల్ బేచారా’. కాగా బాలీవుడ్లో లాక్డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న పలువురు టెక్నీషియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆత్మహత్యకు పాల్పడటం…
Read Moreజార్జ్ ఫ్లాయిడ్ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?
తెల్లజాతి పోలీసు కాళ్ల కింద నలిగి చనిపోయి, తన మరణంతో అమెరికా అంతటినీ కదిలించక ముందే.. ఆఫ్రో-అమెరికన్ అయిన జార్జి ఫ్లాయిడ్ తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. అతని జీవితంలో ఘనతలున్నాయి. 1992లో హ్యూస్టన్లో ఉంటున్నప్పుడు యేట్స్ స్కూల్ లయన్స్ జట్లు తరఫున టెక్సాస్ స్టేట్ ఫుట్బాల్ చాంపియన్ షిప్లో ఫ్లాయిడ్ పాల్గొన్నారు. రన్నర్స్ అప్ టీమ్లో అతను సభ్యుడు. అతని జీవితంలో పతనాలు కూడా ఉన్నాయి. 2007 సంవత్స్రరంలో ఒక దొంగతనం కేసులో ఫ్లాయిడ్ ఐదు సంవత్సరాల జైలు శిక్షను కూడా అనుభవించారు. మిన్నీపోలిస్ నగరంలో మే 25న ఒక పోలీస్ కాళ్ల కింద నలిగి మరణించే నాటికి అతను ఓ సాదాసీదా అమెరికన్ పౌరుడు. వ్యక్తిగతంగా, సామాజికంగా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ మెరుగైన జీవితాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి. దేశంలో లక్షమందికి పైగా…
Read More
You must be logged in to post a comment.