సౌందర్ రాజన్ – చిన్న చికెన్ కొట్టు నుంచి… వేలకోట్ల వ్యాపారం దాకా (సుగుణ ఫుడ్స్)
వ్యాపారాలు చేయాలంటే ఆస్తులూ… పెద్ద పెద్ద బిజినెస్ స్కూళ్లలో పట్టాలూ అక్కర్లేదు. చేయాలనే తపనా, ఎదగాలనే కసీ ఉంటే చాలు… అని నిరూపించారు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన సుగుణ ఫుడ్స్ వ్యవస్థాపకుడు సౌందర్ రాజన్. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా అప్పు చేసిన ఐదు వేల రూపాయలతో జీవితం మొదలు పెట్టిన ఆయన ప్రయాణం నేడు పదకొండు వేల కోట్లకు చేరుకుంది. కోయంబత్తూరుకి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గణపతిపాలయం. అక్కడున్న ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ కొద్దిపాటి సొంత భూమిలో పత్తి కూడా పండించేవారు బంగారుస్వామి, కమలం దంపతులు. వారి ముగ్గురు పిల్లల్లో సౌందర్ రాజన్ పెద్దవాడు, సుందరరాజన్; రెండోవాడు, ఆఖరున ఆడపిల్ల మణిమాల. ఆ అమ్మాయికి చిన్నతనంలోనే పెళ్లి చేశారు. సౌందర్ రాజన్ కేమో బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని ఉండేది. అందుకోసం…
Read More
You must be logged in to post a comment.