మిస్టీ దోయి – తయారు చేసుకునే విధానం

బెంగాలీ భాష లో మిస్టీ అంటే తీపి, దోయి అంటే పెరుగు = తియ్యని పెరుగు (মিষ্টি দই). 150 సంవత్సరాల క్రితం భారత దేశం లోని షేర్పుర్ జిల్లా (ఇప్పుడు ఇది బంగ్లాదేశ్ లో ఉంది.) లో ఆధునిక మిస్తీ దోయి యొక్క మూల వంటకం తయారు ఐయ్యింది. ఆధునిక భారత దేశం లోని బెంగాల్, త్రిపుర,అస్సాం,ఒడిశా రాష్ట్రాలలో అద్భుతమైన డెసెర్ట్ గా పేరుగాంచింది.

తయారు చేసుకునే విధానం:

ఒక లీటరు పాలు తీసుకొని, తక్కువ, మధ్యస్థ మంట మీద ఉంచి సగం అయ్యేదాకా మరిగించండి. ఇప్పుడు మనం ఈ పాలల్లో వేసే ఈ పదార్థమే, ఈ బెంగాలీ వాళ్ళ సీక్రెట్ అండ్ సిగ్నేచర్ ఇంగ్రిడియంట్ …ఖర్జూరబెల్లం… (dates palm jaggery).

బెంగాలీలు వాళ్ళ వంట విషయం లో చాలా particular గా ఉంటారు.కాబట్టి సంప్రదాయ మిస్టీ దోయి లో పంచదార వాడకూడదు. పంచదార వాడితే బెంగాలీ వాళ్ళు అసలు ఒప్పుకోరు, బెంగాల్ లో ఈ ఖర్జూర బెల్లం చాలా సులభంగా దొరుకుతుంది. కొంత మంది తాటి బెల్లం కూడా ఉపయోగిస్తారు.

చాలా రకాల బెంగాలీ స్వీట్లలో కూడా ఈ ఖర్జూర బెల్లం వాడతారు. ఇప్పుడు అర్థమైందా..? బెంగాలీ స్వీట్స్ ఎందుకు అంత మధురంగా ఉంటాయో..! ఇప్పుడు 300 గ్రాముల ఖర్జూర బెల్లం తీసుకుని పాలలో కరిగేదాకా కలపండి. స్టౌ ఆపివేసి పాల మిశ్రమాన్ని గది ఉష్ణోగ్రత వచ్చేవరకు చల్లారబెట్టాలి. తరువాత కొద్దిగా పెరుగు వేసి ఆ మిశ్రమాన్ని, మట్టి కుండలలో పోయాలి. మట్టి కుండలోని చిన్నచిన్న రంధ్రాల వల్ల పెరుగులోని నీరు ఆవిరైపోతుంది. అందువల్ల మిస్తీ డోయి చాలా చక్కగా వస్తుంది. ఆ మిశ్రమాన్ని ఒక 10 లేదా 12 గంటల పాటు కదపకుండా ఉంచితే మిస్తీ డోయి రెడీ… మీరు దాన్ని అలాగే తినవచ్చు లేదా ఒక రెండు గంటలు ఫ్రీజర్ లో ఉంచి తినొచ్చు.

మిస్తీ డోయి లో యాలకుల పొడి వేయరు, ఎందుకంటే మిస్తీ డోయి యొక్క సహజ రుచి ను (natural flavour) యాలకుల పొడి పాడు చేస్తుంది అంటారు బెంగాలీలు.

%d bloggers like this: