ఊటీ అందమైన నీలగిరి పర్వతాలలో ఉన్న అద్భుతమైన పట్టణం. ఈ పట్టణ అధికారిక పేరు ఉదకమండలం, దక్షిణ భారతదేశం లోని ఈ పర్వత ప్రాంతానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే పర్యాటకుల సౌకర్యార్ధం ఇది ఊటీగా సంక్షిప్తీకరించబడింది. ఈ పట్టణం తమిళనాడు రాష్ట్రం లోని నీలగిరి జిల్లా లో ఒక భాగం.ఊటీ పట్టణం చుట్టూ ఉన్న నీలగిరి కొండలు దీని అద్భుతమైన అందానికి బాధ్యత వహిస్తాయి. ఈ పర్వతాలను బ్లూ మౌంటైన్స్ అని కూడా పిలుస్తారు. ఈ లోయలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కురుంజి పూలు పూస్తాయి ఈ పేరుకు మూలం ఇవేనని కొంతమంది ప్రజల నమ్మకం. ఈ పూలు నీలం రంగులో ఉంటాయి, అవి పుష్పించినపుడు ఈ పర్వతాలు నీలం ర౦గులో కనిపిస్తాయి. కొండలపై సమృద్ధిగా పెరుగుతున్న యూకలిప్టస్ చెట్లనుండి ప్రసరించే నీలం పొగవల్ల పర్వతాలు నీలంగా ఉంటాయి అని స్థానికుల అభిప్రాయం.
ఇప్పుడు ఊటీ ప్రసిద్ధ ప్రదేశం, కానీ హాస్యాస్పదంగా దీని చరిత్రకు ఎటువంటి నమోదుచేయబడిన రుజువు లేదు. ఊటీకి పురాతన సామ్రాజ్యంగానీ, భాగం గానీ ఉన్నాయని చూపించడానికి ఎటువంటి పత్రాలు కానీ, గ్రంధాలూ కానీ లేవు. 19 వ శతాబ్దానికి ప్రారంభంలో ఈ ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పగ్గాలు చేపట్టక ముందు, ఈ పట్టణ చరిత్ర తోడా తెగ కాలంనాటిదిగా గుర్తించవచ్చు,
వలస అనువంశకతఈ పట్టణంలో సంస్కృతిలో, నిర్మాణాలలో బ్రిటీష్ వారి ప్రభావం చూడవచ్చు. నిజానికి, ఈ పర్వత ప్రాంతం ఆసక్తి కలిగించేవిగా మిగిలిపోయిన ఇంగ్లీష్ గ్రామం అని పర్యాటకులు గుర్తించారు. బహుశ దీనికి కారణం ఈ పట్టణ ఆర్ధిక వ్యవస్థ ఎక్కువగా పర్యాటక వ్యాపారం పై రూపొందించబడటమే. బ్రిటీషు వారు ఇక్కడి వాతావరణం, అద్భుతమైన అందానికి ముంగ్ధులై ఈ ప్రాంతానికి “హిల్ స్టేషన్స్ రాణి” అని పేరుపెట్టారు. వారు ఒక నిధి లాంటి ఈ ప్రాంతాన్ని వదులుకోవటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే , దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల వేడిని, తేమతో కూడిన వాతావరణాన్ని వారు తట్టుకోలేరు. వారు విల్లింగ్టన్ సమీప పట్టణంలో మద్రాసు రెజిమెంట్ కు సంబంధించి ఆ ప్రాంతంలో స్థిర పడాలని భావించారు. నేడు, విల్లింగ్టన్ ప్రదేశం మద్రాసు రెజిమెంట్ కి కేంద్రంగా ఉంది. నిజానికి, అనేకమంది గాయపడిన, అనారోగ్య సైనికులు ఊటీకి పంపబడ్డారు. విల్లింగ్టన్ మరో మారు పునరుద్ధరించబడింది. వేసవి వేడి నుండి తప్పించుకొనడా నికి చాలామంది వారాంతాల లోకూడా వస్తూ వుండటం తో ఊటీ కి ప్రజాదరణ పెరిగింది. ఈ పట్టణం మద్రాసు ప్రెసిడెన్సీలో వేసవి రాజధానిగా ప్రత్యేకతను కలిగిఉంది.
బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కూడా ఊటీ అభివృద్ధిని చేపట్టారు, నీలగిరుల పై తేయాకు , టేకు, చిన్కోన పంటలు పెంచడం ప్రారంభించారు. ఈ పట్టణ ఆర్ధిక వ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడి ఉంది అనడానికి ఇది మరో ముఖ్యమైన అంశం. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం, సారవంతమైన నేల వ్యవసాయంలో విజయం సాధించడానికి దోహదపడ్డాయి. మీరు ఊటీకి దగ్గరగా ప్రారంభంలో వివిధ టీ, కాఫీ తోటలను చూడవచ్చు. ఇవి స్థానిక ప్రజలకు ప్రధానం అనిచెప్పవచ్చు, వారు ఎన్నో సంవత్సరాలుగా ఈ పనిని చేస్తున్నారు. చాలా అద్భుతమైన టీ మరియు కాఫీ తోటల ఆస్తులు ఇప్పుడు ఊటీలో, చుట్టూ ఉన్నాయి.
ఊటీ పోగొట్టుకున్న చరిత్రఊటీ పాతకాలంలో ప్రపంచంలో ఆకర్షణ కలిగిఉంది, కానీ ఈరోజు దానిస్థితి పోల్చడానికి లేదు. మీరు ఊటీలో చుట్టూ నడుస్తున్నపుడు, మీరు ఊటీలోని భవణాల నిర్మాణం, నమూనాలను చూచినపుడు పురాతన కాలానికి వెళ్ళిపోతారు. అది మీకు గడచిన కాలాన్ని గుర్తుచేస్తుంది. ఊటీ కి ఏవిధమైన చరిత్ర లేదు. బ్రిటిష్ వారి రాకతో దీని పెరుగుదల ప్రారంభమయింది. అయితే, గత రెండు శతాబ్దాలలో ఇది మా దగ్గర లేదు లేదా మా గురించి కోల్పోయింది అనుకోకుండా వుండటం కోసం ఈ పట్టణం తగినంత చరిత్రను తర్వాతి కాలంలో సృష్టించింది.
ఆధునిక ప్రపంచంలో, ఊటీ చరిత్ర పరదేశ భూమిలో బ్రిటీష్, ముఖ్యంగా సైనికుల స్తావరలతో మొదలైనది. ఈ పట్టణంలో ప్రవేశించిన వారికి ఆ ప్రదేశం లో బ్రిటీష్ వారి ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. కళలు, భవన నిర్మాణం, నమూనాలు, ఇళ్ళ నిర్మాణంలో శైలి అన్నీ బ్రిటీష్ కాలాన్ని గుర్తుకుతెస్తాయి. బ్రిటీషు వారి సాంస్కృతిక పద్ధతులు స్థానిక ప్రజల జీవితాల మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా తీవ్రంగా పాతుకు పోయాయి. స్థానిక వంటకాలు కూడా ఇంగ్లీష్ వంటకాల నుండి భారీగా అరువు తీసుకుంది. దీని ఫలితంగా, మీరు ఇంగ్లీషు మూలికలు, భారతదేశ సుగంధ ద్రవ్యాల విలీనీకరణంతో ఊటీలో ఉత్తమ ఆహరం పొందుతున్నారు. కష్టపడి పనిచేసే స్థానిక ప్రజలతో పాటు, బ్రిటిష్ విజయం సాధించడానికి దోహదపడ్డారు, అందువల్ల ఊటీ నేడు ఆనందిస్తుంది. ఈ గొప్ప సాంస్కృతిక భిన్నత్వం ఊటీలో మాత్రమే మనుగడలో ఉంది. అయితే, నేడు ఊటీకి గత చరిత్ర లేదని లేదా భారతదేశ అభివృద్ధిలో ఎటువంటి చారిత్రక ప్రాధాన్యత లేదని చెప్పడం తప్పు,
సుందరమైన హిల్ స్టేషన్స్ కు రారాజు వంటిది ఊటి. ఉదకమండలంనే ఊటి అని అంటారు. భారతదేశంలోని దక్షిణాదిన తమళనాడులో పశ్ఛిమ కనుమలలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం. నీలగిరి జిల్లా కేంద్రం ఊటి. కాఫీతోటలు, టీ తోటలు ఇంకా అనేక రకాల చెట్లతో పచ్చగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
వేసవిలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల నుండి 25 డిగ్రీలకు మించదు. చలికాలంలో 5 డిగ్రీల నుండి 21 డిగ్రీలకు వరకు ఉంటుంది. తోడాలు అనే స్థానిక గిరిజనుల నివాస ప్రాంతం ఇది. బ్రిటీష్ వారి కాలంలో ఊటి ప్రాంతానికి మొట్టమొదటిసారిగా రైలు మార్గం వేయబడింది. ఊటిలో కూనూరు (ఊటి నుండి 19 కి.మీ) కొత్తగిరి (ఊటి నుండి 31 కి.మీ) మరి రెండు హిల్ స్టేషన్స్. పర్యటనుకు సాధారణంగా ఏప్రియల్ నుండి జూన్ మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు అనుకూలం. స్థానికంగా తమిళం, కన్నడం, మళయాళం, ఇంగ్లీష్ మరియు బాడగ భాషలు మాట్లాడతారు.
బొటనికల్ గార్డెన్ లు , దోడబెట్ట శిఖరం, ఊటీ సరస్సు, కల్హట్టి జలపాతం, ఫ్లవర్ షో మొదలైన కొన్ని ప్రదేశాల వల్ల ఊటీ ప్రపంచం మొత్తం మీద పర్యాటకులలో ఎంతో ప్రసిద్ది చెందింది. ఈ ప్రాంతాన్ని రోడ్డు, రైలు ద్వారా తేలికగా చేరుకోవచ్చు. ఊటీకి సమీప విమానాశ్రయం కోయంబత్తూర్ వద్ద ఉంది. ఊటీలో వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లదకరంగా ఉంటుంది . అయితే, శీతాకాలం దక్షిణ భారతదేశ సాధారణం కంటే కొంచే౦ తక్కువ చల్లగా ఉంటుంది.
ఊటీ సరస్సు
ఊటీ లేక్ , ఊటీ దర్శించే పర్యాటకులకు ప్రసిద్ధ ఆకర్షణ. ఇది ఒక కృత్రిమ సరస్సు. దీనిని 1824 లో జాన్ సుల్లివాన్ సుమారు 65 ఎకరాల లో నిర్మించారు. వర్షాకాలం లో కొండలపై నుండి పడే నీటిని ఈ సరస్సు పొందుతుంది. అది నిండిన వెంటనే సుమారు మూడు సార్లు ఖాళీ చేస్తారు. స్థానిక మత్స్యకారులు ఇక్కడ చేపలు వేతాడతారు. ఈ సరస్సు సమీపంలో ఒక బస్సు స్టాండ్, ఒక రేస్ కోర్స్ మరియు ఒక పార్క్ నిర్మించటం వలన మరియు భౌగోళిక కారణాలుగా కుచించుకు పోయింది. ప్రస్తుతం బోటు విహారాల కారణంగా నే ప్రసిద్ధి చెందినది. బోటు విహారం చేస్తూ ప్రకృతి దృశ్యాలు ఆనందించవచ్చు. మే నెలలో ప్రభుత్వం రెండు రోజులపాటు బోటు రేస్ లు నిర్వహిస్తుంది.
ఊటిలో చూడవలసినవి : గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్స్ 22 హెక్టార్లలో విస్తరించి ఉన్నవి. 1847 సం.లో మద్రాస్ గవర్నర్ చే ఏర్పాటు చేయబడ్డవి. ఈ బొటానికల్ తోటలు 6 భాగాలుగా విభజించబడినవి.
1. లోయర్ గార్డెన్
2. న్యూ గార్డెన్
3. ఇటాలియన్ గార్డెన్
4. కన్సర్ వేటరీ
5. ఫౌంటెన్ టెర్రాస్
6. నర్సరీ
అరుదైన చెట్లజాతితో, సన్నజాజి పొదలతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మంకి ఫజిల్ ట్రీ అనే ఒకరకమైన చెట్లమీద కోతులు కూడా ఎక్కలేవు. ఇటాలియన్ ఫ్లవర్ గార్డెన్ లో చెరువు అనేకరకాల ఆర్కిడ్ మరియు పూల పోదలతో కనువిందు చేస్తుంది. ప్రతి సంవత్సరం మే నెలలో అరుదైన పూలతో ఫ్లవర్ షో జరుగుతుంది. ఈ గార్డెన్స్ ను తమిళనాడు హార్టికల్చర్ వారు నిర్వహిస్తున్నారు.రోజ్ గార్డెన్ : ఈ ప్రాంతంలో చూడవలసినది 4 హెక్టార్లలలో విస్తరించి ఉన్న రోజ్ గార్డెన్. రోజ్ గార్డన్ ఉదకమండలం రైల్వే స్టేషన్, బస్టాండ్ కు కేవలం 1 కిలో మీటరు దూరంలో ఉన్నది. మొత్తం 20,000 రోజామొక్కలు 2,241 జాతులకు చెందినవి ఇక్కడ పెంచబడుచున్నవి. ఇక్కడ వున్న నీలమడం అనే ప్రాంతనుండి రోజ్ గార్డెన్ మొత్తం దృశ్యాన్ని చూడవచ్చు.
లేక్ పార్క్ : ఊటి రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ కు సమీపం ఉన్న లేక్ పార్క్ 1977 సం.లో ఏర్పాటు చేయబడ్డది. స్థానికులకు మరియు పర్యాటకులకు మంచి పర్యాటకస్థలం.
ఊటి లేక్ : 1824 సం.లో జాన్ సులివాన్ (కోయంబత్తూరు కలక్టర్) చే ఈ కృత్రిమ సరస్సు 65 ఎకరాలలో ఏర్పాటు చేయబడినది. ఈ చెరువు చేపలకు ప్రసిద్ది. బోటింగ్ సౌకర్యం కలదు మరియు మిని ట్రయిన్ కూడా కలదు.
జింకలపార్క్ : ఈ ప్రాంతంలో మరొక ప్రధాన ఆకర్షణ 1986 సం. లో 22 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడ్డ జింకల పార్క్. కాని 6 ఎకరాలు మాత్రమే అభవృద్ధి చేయబడి వన్యప్రాణులకు ఆవాసం కల్పించబడుచున్నది. దగ్గర నుండి వన్యప్రాణులను చూడవచ్చు.
మ్యూజియం : ఊటి – మైసూర్ రోడ్ లో ప్రభుత్వం వారిచే ఏర్పాటు చేయబడ్డ మ్యూజియంలో ఆటవికులకు చెందిన వస్తువులు, చేతితో తయారు చేయబడ్డ వస్తువులు మొదలగునవి చూడవచ్చు. ఆర్ట్ గ్యాలరీ : ఉదకమండలానికి రెండు కిలోమీటర్ల దూరంలో మైసూర్ రోడ్లో ఉందీ ఆర్ట్ గ్యాలరీ. సమకాలీన పెయింటింగ్స్, శిల్పాలు ఇక్కడ చూడవచ్చు.
బొటానికల్ గార్డెన్స్
ఊటీ లోని బొటానికల్ గార్డెన్స్ లేదా ప్రభుత్వ బొటానికల్ గార్డెన్స్ సుమారు 22 హెక్టార్ ల లో విస్తరించి వున్నాయి. దోద్దబెట్ట శిఖరం ఏటవాలు ప్రదేశాల లో కల ఈ గార్డెన్ లు పచ్చటి తివాచీ ల వాలే కనపడతాయి. వీటి నిర్వహణ అంతా తమిళ్ నాడు హార్టికల్చర్ శాఖ నిర్వహిస్తుంది. ఈ గార్డెన్ లను 1847 సంవత్సరం లో వేసారు వీటిని ఇంగ్లీష్ ఆర్కిటెక్ట్ విలియం గ్రహం మేక్వీర్ రూపొందించారు. స్వాతంత్రానికి ముందు వీటిలోకి ప్రవేశానికి సభ్యత్వం అవసరం. యురోపెయన్ లకు మాత్రమే అది వుండేది.
నెలకు రూ.3 వసూలు చేసేవారు. ప్రతి సంవత్సరం ఈ గార్డెన్ లను లక్షలాది పర్యాటకులు దర్శిస్తారు. ఇక్కడ అన్ని రకాల మొక్కలు వుంటాయి. సాధారణ చెట్ల నుండి ఔషధ మొక్కలు, బోన్సాయ్ మొక్కలు కలవు. గార్డెన్ ఆవరణ లో ఒక పెద్ద ప్రాచీన చెట్టు కాండం కలదు. ఇది సుమారు 20 మిలియన్ సంవత్సరాల నాటిది గా చెపుతారు.ఫ్లవర్ షో
మకర పొంగల్ పండుగ సందర్భంగా ఒక ఫ్లవర్ షో కూడా నిర్వహిస్తారు. ఈ ఫ్లవర్ షో లో అతి చక్కగా అలంకరించి ప్రదర్శించిన వారికి బహుమతులు అందిస్తారు. ఈ ఫ్లవర్ షో లో స్థానిక ప్రజలు, ఇరుగు పొరుగు గ్రామాల వారు కూడా వచ్చి అత్యుత్సాహంతో పాల్గొంటారు.
వెన్ లాక్ డౌన్స్

వెన్ లాక్ డౌన్స్ అనేది ఒక ప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశం దాని సుందర దృశ్యాల కారణంగా ఇక్కడ అనేక ఫిలిం షూటింగ్ లు జరుగుతాయి. ఏటవాలు కొండలు, పచ్చటి మైదానాలు మీ హృదయాన్ని పులకింప చేస్తాయి. వెన్ లాక్ డౌన్ ప్రాంతం సుమారు 20,000 ఎకరాలలో విస్తరించి వుంది. ఈ ప్రదేశం లో యుకలిప్తాస్ చెట్లు హుందాగా నిలబడి వుంటాయి.
స్వాతంత్రానికి పూర్వం ఈ ప్రదేశం యురోపెయన్ లలో ఎంతో ప్రసిద్ధి పొందినది. వారు ఇక్కడకు హంటింగ్ కు వచ్చేవారు. దీనిని ఉదగమండలం హంట్ అనేవారు. ఇండియా కు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ హంటింగ్ నిషేధించారు. ఊటీ కి వచ్చిన వారు ఇక్కడకు తప్పక వస్తారు. ఇక్కడ ఒక జింఖాన క్లబ్ , గోల్ఫ్ కోర్స్ మరియు ప్రభుత్వ గొర్రెల ఫార్మ్ కూడా కలవు.
దోద్దబెట్ట శిఖరం

నీలగిరులలో దోద్దబెట్ట శిఖరం అతి పొడవైనది. కన్నడంలో దొడ్డ బెట్ట అంటే, పెద్ద కొండ అని అర్ధం చెపుతారు. ఇది సుమారు 8650 అడుగుల పొడవు వుంటుంది. ఊటీ సిటీ నుండి ఈ శిఖరం 9కి.మీ. ల దూరంలో ఊటీ – కోటగిరి రోడ్ లో కలదు. ఇక్కడ నుండి చాముండి హిల్స్ చక్కగా చూడవచ్చు. దోద్దబెట్ట శిఖరం నుండి కుల్కూడి, కట్ట దాడు మరియు హేకుబా శిఖరాలు కూడా చూడవచ్చు. ఈ మూడు శిఖరాలు ఉదగమండలంకు సమీపం. దోద్దబెట్ట శిఖరం వాస్తవంగా బల్లపరుపుగా వుండటం విశేషం. టూరిస్ట్ సీజన్లో ఏప్రిల్ మరియు మే నెలలలో సుమారు 3,500 మంది పర్యాటకులు రోజుకు దీనిని సందర్శిస్తారు. ఈ శిఖర ఆకర్షణ పెంచేందుకు ప్రభుత్వం ఇక్కడే శిఖరం పైన ఒక ఖగోళ అబ్సర్వేటరీ ఏర్పాటు చేసింది. ఇక్కడ రెండు టెలీస్కోప్ లు కలవు. వీటి నుండి పర్యాటకులు వాలీ దృశ్యాలు చూడవచ్చు.



ఊటిలో బస చేయటానకి పూర్తి సౌకర్యాలతో గల కాటేజ్ లు, హోటల్స్ కలవు. ఇంకా ఊటి చుట్టూ అనేక పర్యాటక ప్రాంతాలున్నవి. వాటి వివరాలకు మరియు పూర్తివివరాలకు తమిళనాడు టూరిజం వారి ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి
Tamilnadu Tourism Website
ఎలా వెళ్ళాలి : దగ్గరలో గల విమానాశ్రయం కోయంబత్తూరు (ఊటికి 104 కి.మీ. దూరం) కోయంబత్తూరు మరియు చెన్నై నుండి మొట్టుపాలెం అక్కడ నుండి ఊటికి రైలు మార్గంలో వెళ్ళవచ్చు. మద్రాసులో అనేక ప్రాంతాల నుండి రోడ్డు మార్గంలో వెళ్ళవచ్చు.
You must log in to post a comment.