జైపూర్ – పింక్ సిటీ

భారతదేశంలోని పురాతన నగరమైన జైపూర్, పింక్ సిటీ గా ప్రసిద్ది చెందింది. రాజస్తాన్ రాజధానైన జై పూర్ పాక్షిక ఎడారి ప్రాంతంలో ఉంది. ఈ సుందర నగరాన్ని అంబర్ మహారాజు, రెండవ మహారాజ సవాయి జై సింగ్ బెంగాల్ కు చెందిన వాస్తు శిల్పి విద్యాధర్ భట్టాచార్య సహాయంతో నిర్మించాడు. వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నిర్మించిన భారత దేశం లోని మొదటి నగరం కూడా ఇదే .   హిందూ నిర్మాణ శైలి కి ఒక అద్భుత ఉదాహరణ అయిన ఈ ప్రాంతాన్ని ‘పీఠపాద’ లేదా ఒక ఎనిమిది భాగాల మండలం రూపంలో నిర్మించారు. ఖగోళ శాస్త్రంలో చక్కటి జ్ఞానం ఉన్న సవాయి జై సింగ్ మహారాజు 9 అంకెకు ప్రాధాన్యత నిచ్చి దీనిని, దీని గుణకాలను ఈ నగర నిర్మాణంలో ఉపయోగించారు. 9 అంకె 9 గ్రహాలను సూచిస్తుంది.   కోటలు, భవనాలు, రాజప్రాసాదాలకు ప్రసిద్ది చెందిన జైపూర్ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. చారిత్రిక వారసత్వంతో బాటుగా దీని గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను చూసేందుకు సుదూర ప్రాంతాలనుండి ప్రజలు వస్తారు. అంబర్ కోట, నహర్ ఘర్ కోట, హవా మహల్, షీష్ మహాల్, గణేష్ పోల్, జల మహల్ జైపూర్ లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో కొన్ని.   సిటీప్యాలెస్! ………..

సిటీప్యాలెస్కి స్వాగతమందిరం ముబారక్మహల్. ఇక్కడి నుంచి ముందుకెళ్తే రెండవ మాన్ సింగ్ మ్యూజియం కనిపిస్తుంది. రాజకుటుంబాల జీవనశైలికి ప్రతీక ఇది. ఎంబ్రాయిడరీ దుస్తులు, బెనారస్ పట్టుచీరలు, రాజులు ధరించిన పైజామాలు, ఛోగాలు(చొక్కాలు), జమావర్ శాలువాలు, వడ్డాణాలు…

రాజపుత్రులు ఆజానుబాహులు అనడానికి నిదర్శనం మొదటి మాధోసింగ్ దుస్తులే. ఈ రాజు ఏడడుగుల పొడవు ఉండేవాడని నిర్ధారిస్తున్నట్లు ఉంటాయి ఇవి. మహారాణి ప్యాలెస్లోని ఆయుధాగారంలో ఐదు కిలోల బరువైన కత్తి ఉంటుంది. రాజపుత్రులు… జానపద కథల్లో విన్నంతటి బలశాలులే అని రుజువుచేస్తున్నట్లుగా ఉంటుందీ ఈ భారీ ఖడ్గం. రాజులు వార్థక్యంలోకి అడుగుపెట్టిన తర్వాత వాహ్యాళికెళ్లేప్పుడు ఉపయోగించే చేతికర్రలు కూడా ఉంటాయి.

మరో సెక్షన్లోకి అడుగుపెడితే ఫిరంగులు, డబుల్ బ్యారెల్గన్, పిస్టల్లు ఉంటాయి. ఇక్కడ కనిపించే నెమలిపిడికత్తులు, పర్షియా ఆయుధాలు, దక్కనులో వాడే చేతి విల్లంబులు, బాణాలు… ఒక ఎత్తయితే కెంపులు, మరకతాలు పొదిగిన కత్తి మరో ఎత్తు. ఇది మహారాజా సవాయ్ రామ్సింగ్కు బ్రిటిష్ రాణి విక్టోరియా బహూకరించిన కత్తి. మ్యూజియం దాటి బయటకు వస్తే… గైడ్ వెంటే పర్యాటకుల అడుగులు దివాన్ ఈ ఖాస్, దివాన్ ఇ ఆమ్ వైపు పడతాయి. ఇవి రాజు ఆంతరంగికులను, ప్రజలను కలిసే మందిరాలు. దివానీ ఆమ్ (ఆర్ట్ గ్యాలరీ) పై కప్పుకి ఉన్న చిత్రలేఖనాలలో పొదిగిన రంగురాళ్లు ఇప్పటికీ మెరుపులీనుతుంటాయి. పెద్ద క్రిస్టల్ షాండ్లియర్ చూపుతిప్పుకోనివ్వదు. గ్యాలరీలోని చిత్రలేఖనాలలో రామాయణ సన్నివేశాలే ప్రధానం. మరికొంచెం ముందుకుపోతే చంద్రమహల్… ఈ మందిరం నుంచి గోవింద్జీ ఆలయం కనిపిస్తుంది. కృష్ణుని భక్తులైన రాజపుత్రులు ఆలయం కనిపించేటట్లు ఈ మహల్ను కట్టించుకున్నారు.  

ఉత్సవాలు, పండుగలు
భవనాలు, కోటలతో బాటుగా ఈ ప్రాంతం అనేక ఉత్సవాలు, పండగలకు ప్రసిద్ది చెందింది. జనవరి లో నిర్వహించే జైపూర్ వింటేజ్ కార్ ర్యాలీ అటువంటి ప్రసిద్ధ సంవత్సరపు పండుగలలో ఒకటి. పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తూ ఇటీవల బాగా ప్రసిద్ది చెందిన కార్యక్రమం. వాహన ప్రియులు మెర్సిడెస్, ఆస్టిన్, ఫియట్ వంటి పాత కార్ల అద్భుతమైన సేకరణను చూడవచ్చు. వీటిలో కొన్ని కార్లు 1900 కు చెందినవి.   ప్రతి ఏటా జైపూర్ లో హోలీ నాడు ఇక్కడ ప్రసిద్ది చెందిన ఏనుగుల పండుగను నిర్వహిస్తారు. చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఏనుగుల అందమైన ఊరేగింపులు ఈ ఉత్సవానికి జీవం పోస్తాయి. దీనితో బాటుగా, గంగౌర్ పండుగా కూడా ఇక్కడ ఎంతో ప్రసిద్ది చెందింది. గం అనగా శివుడని, గౌర్ అనగా పార్వతి అనే అర్ధం ఉంది. ఈ పండుగ వైవాహిక ఆనందానికి సంకేతం. ఈ నగరం లో జరిగే ప్రసిద్ధ ఉత్సవాలు, పండుగలలో బాన్ గంగ ఉత్సవం, తీజ్, హోలీ, చక్సు ఉత్సవం ఉన్నాయి.   సాహస ప్రియులు ఒంటె స్వారి, హాట్ ఎయిర్ బెలూనింగ్, పార గ్లైడింగ్, పర్వతారోహణ వంటి క్రీడలతో వినోదించ వచ్చు. అన్వేషణ ఔత్సాహికులు కరౌలి, రణథంబోర్ నేషనల్ పార్క్ వంటి వాటికి విహార యాత్రకు వెళ్ళవచ్చు.   జైపూర్ లో షాపింగ్ పర్యాటకులకు నచ్చుతుంది. ఇక్కడ అనేక మార్కెట్లు ఇతర వస్తువులతో బాటు పురాతన వస్తువులు, ఆభరణాలు, తివాచీలు, కుండలు, రత్నాలు విస్తృత శ్రేణిలో అందిస్తున్నాయి. పర్యాటకులు హస్తకళా కృతులు, కళాఖండాలు, దుస్తులు, పేరుందిన దుస్తులు ఎం ఐ రోడ్డు నుండి కొనుగోలు చేయవచ్చు. జైపూర్ లోని స్థానిక మార్కెట్ లలో కొనుగోలు చేసినప్పుడు బేరసారాలు అవసరం.   విందులుఈ ప్రాంతం ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి తో చేసిన రుచికరమైన కారపు వంటకాలకు ప్రసిద్ది చెందింది. దాల్ బాటి – చూర్మా, ఉల్లి కచోరి, కబాబ్, ముర్గ్ కో ఖాటో, అచారి ముర్గ్ ఈ నగరపు ప్రసిద్ధ వంటకాలలో కొన్ని. వీధి వంటలకు ప్రసిద్ది చెందిన నెహ్రు బజార్, జోహరి బజార్లలో భోజన ప్రియులు ఈ వంటకాలను రుచి చూడవచ్చు. ఈ ప్రాంతపు స్థానిక మిఠాయిలైన ఘేవర్, మిష్రి కోవ, కోవా కచోరి దేశవ్యాప్తంగా ప్రసిద్ది పొందాయి.

హవా మహల్

హవా మహల్ 1799 లో కవి రాజైన సవాయి ప్రతాప్ సింగ్ కట్టించిన ప్రసిద్ధ కట్టడం. ఇది జోహారి బజార్ సమీపంలోని ఐదు అంతస్తుల ఎరుపు, గులాబి రంగు ఇసుక రాయి భవనం. లాల్ చాంద్ ఉస్తా రూపొందించిన దీనిలో 950 కంటే ఎక్కువ కిటికీలు ఉన్నాయి. ఈ భవనాన్ని పల్చటి తెరల గుండా రాచకార్యాలు చూడటానికి స్త్రీల కోసం నిర్మించారు. ఈ భవనంలో పురావస్తు శాఖ వారి మ్యూజియం ఉంది.

షీష్ మహల్



అంబర్ కోట లోపల ఉన్న షీష్ మహల్ అద్దాల భవనంగా ప్రసిద్ది చెందింది. జై మందిరం లో భాగమైన ఈ భవనాన్ని అద్దాలతో అందంగా అలంకరించారు.గోడలు, పై కప్పు పై ఉన్న అద్దాల మీద కాంతి కిరణాలు పరావర్తనం చెంది భవనమంతా ప్రకాశవంతమౌతుంది. జైపూర్ మహారాజు రాజా జై సింగ్ 1623 లో తన ముఖ్య అతిథులను కలిసేందుకు దీనిని కట్టించాడు. ఈ భవనం లో వాడిన అద్దాలను బెల్జియం నుండి ప్రత్యేకం గా తెప్పించారు.

ఏడాది పొడవున ఈ ప్రాంతంలో తీవ్రమైన వాతావరణం ఉంటుంది. వేసవికాలం విపరీతమైన వేడితో ఉండగా, శీతాకాలంలో గడ్డ కట్టించే చలి ఉంటుంది. వేసవికాలం లో జైపూర్ ను సందర్శించే పర్యాటకులు తేలికైన దుస్తులు, టోపీలు, సన్ స్క్రీన్ లోషన్, తప్పనిసరిగా తెచ్చుకోవాలి. మార్చ్ నుండి అక్టోబర్ మధ్య ఉన్న సమయం ఈ పింక్ సిటీ సందర్శనకు ఉత్తమమైనది.   వెండికూజాలు!

సిటీప్యాలెస్లో అత్యంత ఆకర్షణీయమైనవి వెండికూజాలు. మహారాజా రెండవ మాధోసింగ్ యూరప్ పర్యటనకు వెళ్లినప్పుడు రెండు కూజాల్లో గంగనీరు తీసుకెళ్లాడు. ఒక్కో కూజా సామర్థ్యం తొమ్మిది వేల లీటర్లు. యూరప్ పర్యటన కోసమే ఈ కూజాలను చేయించారు. ఇవి ప్రపంచంలో అతిపెద్ద వెండి పాత్రలుగా గిన్నిస్ బుక్లో రికార్డుకెక్కాయి.
జంతర్మంతర్!

ఇది ఖగోళశాస్త్ర ప్రావీణ్యానికి ప్రతీక. ఢిల్లీ జంతర్మంతర్కి మాతృక కూడ. సవాయ్ జయ్సింగ్ నిర్మించిన ఐదు అబ్జర్వేటరీల్లోకి ఇదే పెద్దది (మిగిలినవి వారణాసి, ఉజ్జయిని, మధురలలో). ఇక్కడి నుంచి బయటకు వెళ్తే స్వాగతం పలికే నిర్మాణం హవామహల్. జయ్పూర్కి చిహ్నంగా పరిగణించే హవామహల్ కృష్ణుని కిరీటాన్ని పోలి ఉంటుంది. గవాక్షాల మాటున ఉన్న గదుల్లోంచి రాణివాసపు స్త్రీలు నగరంలో జరిగే వేడుకలు చూసేవారు. ఇక్కడి నుంచి జయ్ఘర్ ఫోర్ట్లో అడుగుపెడితే రాజమందిరాలు, ఉద్యానవనాలు, రిజర్వాయర్లు, ధాన్యాగారం, ఆయుధారాగం, ఆలయాలు ఉంటాయి. ఇది ఉంది అది లేదు అనడానికి వీల్లేనంత పకడ్బందీగా ఉంటాయి ఈ కోటలు. జగత్ శిరోమణి ఆలయంలో భక్తమీరా కొలుస్తున్న కృష్ణుని విగ్రహం ఉంటుంది. అంబర్!

రామ్ నివాస్ గార్డెన్లో ఆల్బర్ట్ హాల్ ఉంది. ఈజిప్టు మమ్మీ, పర్షియాలో తయారైన బంగారు తివాచీ ప్రధాన ఆకర్షణలు. జయ్పూర్ నుంచి ఢిల్లీ వైపుగా పదికిలోమీటర్లు ప్రయాణిస్తే అంబర్ కోట వస్తుంది. జయ్పూర్ నిర్మాణానికి ముందు పాలన ఈ కోట నుంచే జరిగేది. ఏనుగు అంబారీ ఎక్కి కోట మీదకు వెళ్లవచ్చు. ఈ పర్యటనలో సున్నితత్వం అంతా సిసోడియా రాణీకా బాఘ్లోనే కనిపిస్తుంది. ఈ గార్డెన్ జయ్పూర్కి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఆగ్రా రూట్లో వస్తుంది. సవాయ్ జయ్సింగ్… సిసోడియా యువరాణిని మనసు పడి వివాహమాడి, ఆమెకు ఇష్టమైనట్లు ఉద్యానవనాన్ని నిర్మించాడు. రాణి కాలు కింద పెట్టకుండా ఉద్యానవనంలో విహరించేటట్లు టై గార్డెన్ ఏర్పాటు చేశాడు.

ఆహారం……..
రాజస్థాన్ సంప్రదాయ భోజనం రుచి చూడాలంటే జోరి బజార్లోని ఎల్ఎంబి రెస్టారెంట్కి, స్వీట్స్కి రావత్ మిస్థాన్ భండార్కి వెళ్లాలి. గుజరాతీ రుచుల కోసం అన్నపూర్ణ, పనీర్ బటర్ మసాలా కోసం ‘సూర్య మహల్’, విదేశీ రుచులకు ‘కాపర్ చిమ్నీ’, ఇటాలియన్ పిజ్జా తినాలంటే పిజ్జాహట్, చిరుతిళ్లకు ఇండియన్ కాఫీ హౌస్కు వెళ్లవచ్చు.

వాతావరణం………..
ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుతాయి. జూన్ – సెప్టెంబరు వర్షాకాలం. అక్టోబర్, నవంబరు ఆహ్లాదంగా ఉంటుంది. డిసెంబర్ – ఫిబ్రవరిఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పడిపోతాయి. మార్చిలో బావుంటుంది.
విద్యాధర బాఘ్… రెండవ జయ్సింగ్ కొలువులో ప్రధాన వాస్తుశిల్పి విద్యాధరుడు. సిసోడియా రాణి కా బాఘ్ వంటి అద్భుత నిర్మాణాల రూపకర్త. అందుకే ఒక ఉద్యానవనానికి విద్యాధరుడి పేరు పెట్టారు.
జల్మహల్… మన్సాగర్ మధ్యలో ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడికి వలస పక్షులు వస్తాయి.

షాపింగ్ …..
జైపూర్ చెప్పులకు (జూటీ) రామ్గంజ్ బజార్, టై అండ్ డై దుస్తులకు కృష్ణపాల్ బజార్, అలంకరణ వస్తువుల కు మనిహారన్ కా రాస్తా, తివాచీలకు సుభాష్ చౌక్, మార్బుల్ కళాకృతులకు ఖజనో కా రాస్తా, హస్తకళలు, నీలిరంగు పింగాణీ వస్తువుల కోసం సంగనెర్ గ్రామానికి వెళ్లాలి. ఒంటె చర్మంతో చేసిన బ్యాగ్లు, చెప్పులు, పర్సులకు విదేశాల్లో డిమాండ్. ఇక జయ్పూర్ కుందన్, జేడ్ ఆభరణాల దుకాణాలు ఇక్కడ చాలానే ఉంటాయి.

ఉత్సవాలు, పండుగలు
భవనాలు, కోటలతో బాటుగా ఈ ప్రాంతం అనేక ఉత్సవాలు, పండగలకు ప్రసిద్ది చెందింది. జనవరిలో నిర్వహించే జైపూర్ వింటేజ్ కార్ ర్యాలీ అటువంటి ప్రసిద్ధ సంవత్సరపు పండుగలలో ఒకటి. పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తూ ఇటీవల బాగా ప్రసిద్ది చెందిన కార్యక్రమం. వాహన ప్రియులు మెర్సిడెస్, ఆస్టిన్, ఫియట్ వంటి పాత కార్ల అద్భుతమైన సేకరణను చూడవచ్చు. వీటిలో కొన్ని కార్లు 1900 కు చెందినవి.

ప్రతి ఏటా జైపూర్ లో హోలీ నాడు ఇక్కడ ప్రసిద్ది చెందిన ఏనుగుల పండుగను నిర్వహిస్తారు. చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఏనుగుల అందమైన ఊరేగింపులు ఈ ఉత్సవానికి జీవం పోస్తాయి. దీనితో బాటుగా, గంగౌర్ పండుగా కూడా ఇక్కడ ఎంతో ప్రసిద్ది చెందింది. గం అనగా శివుడని, గౌర్ అనగా పార్వతి అనే అర్ధం ఉంది. ఈ పండుగ వైవాహిక ఆనందానికి సంకేతం. ఈ నగరం లో జరిగే ప్రసిద్ధ ఉత్సవాలు, పండుగలలో బాన్ గంగ ఉత్సవం, తీజ్, హోలీ, చక్స్ ఉత్సవం ఉన్నాయి. సాహస ప్రియులు ఒంటె స్వారి, హాట్ ఎయిర్ బెలూనింగ్, పార గ్లైడింగ్, పర్వతారోహణ వంటి క్రీడలతో వినోదించ వచ్చు. అన్వేషణ ఔత్సాహికులు కరౌలి, రణథంబోర్ నేషనల్ పార్క్ వంటి వాటికి విహార యాత్రకు వెళ్ళవచ్చు.

జైపూర్ లో షాపింగ్ పర్యాటకులకు నచ్చుతుంది. ఇక్కడ అనేక మార్కెట్లు ఇతర వస్తువులతో బాటు పురాతన వస్తువులు, ఆభరణాలు, తివాచీలు, కుండలు, రత్నాలు విస్తృత శ్రేణిలో అందిస్తున్నాయి. పర్యాటకులు హస్తకళా కృతులు, కళాఖండాలు, దుస్తులు, పేరుందిన దుస్తులు ఎం ఐ రోడ్డు నుండి కొనుగోలు చేయవచ్చు. జైపూర్ లోని స్థానిక మార్కెట్ లలో కొనుగోలు చేసినప్పుడు బేరసారాలు అవసరం.

ఎలా వెళ్లాలి?
సమీప విమానాశ్రయం: జైపూర్. హైదరాబాద్ నుంచి జైపూర్కి ఎకానమీ క్లాస్ విమానం టిక్కెట్టు రూ5000.
సమీప రైల్వేస్టేషన్: జైపూర్ జంక్షన్. కాచిగూడ నుంచి జైపూర్ జంక్షన్కి నార్త్వెస్టర్న్ రైల్వే రైళ్లు ఉన్నాయి. మైసూర్-జైపూర్ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ నుంచి జైపూర్కి టిక్కెట్టు ధరలు స్లీపర్లో రూ600, ఏసీ త్రీటైర్లో రూ 1500, ఫస్ట్క్లాస్లో రూ 4000 ఉంటాయి. సికింద్రాబాద్ – జైపూర్ ఎక్స్ప్రెస్లోనూ దాదాపుగా ఇంతే. ప్రయాణం 30 గంటలు.
ఎప్పుడు వెళ్లవచ్చు?
అక్టోబర్, నవంబర్, మార్చి నెలలు సౌకర్యం.
వసతి సౌకర్యం….
హోటల్ పెర్ల్ ప్యాలెస్… డబుల్ రూమ్ (షేరింగ్ బాత్రూమ్)
ఏసీ డబుల్ రూమ్ ఫ్యామిలీ రూమ్ వీటిలో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉండదు.
అనురాగ్ విల్లా… నాన్ఏసీ డబుల్ రూమ్ ….సూపర్ డీలక్స్ గార్డెన్ వ్యూ గది
రామ్బాఘ్ ప్యాలెస్…..
వీటితోపాటు ఒక రాత్రికి ఆరేడు వందలు చార్జ్ చేసే వినాయక్ గెస్ట్హౌస్ వంటివీ ఉన్నాయి.

%d bloggers like this: