మల్లాడి కృష్ణారావు (1964)
మల్లాడి కృష్ణారావు గారు పుదుచ్చేరి రాష్ట్రంలో ఉన్న యానాం జిల్లా దరియాల తిప్ప గ్రామంలో నిరు పేద మత్స్యకారుల కుటుంబంలో జన్మించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన కృష్ణారావు గారు కుటుంబసభ్యులతో భేదాభిప్రాయాలు కారణంగా స్వగ్రామం నుంచి యానాంలో స్థిరపడి అక్కడే వ్యాపార రంగంలో ప్రవేశించి మంచి లాభాలు ఆర్జించారు.
వ్యాపారవేత్త గా విజయవంతమైన తరువాత సామాజిక సేవలోకి ప్రవేశించి అనేక మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్య కు ఆర్థిక సహాయం, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు నిర్మించారు, అలాగే తన సొంత స్థలంలో వేలాది మంది పేదలకు ఇళ్ళు నిర్మించారు. మద్యపానం వ్యతిరేకంగా యానాం ప్రాంతం మొత్తం మహిళలతో ధర్నాలు నిర్వహించి విజయవంతంగా యానంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించడం లో సఫలీకృతం అయ్యారు.
1994లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణారావు గారు , 1996, 2001(ఇండిపెండెంట్), 2006,2011, 2016 లలో యానాం నుంచి 5 సార్లు ఎన్నికయ్యారు, 2000లో పోటీ చేయలేదు.
2006 నుంచి ఒక్క ఆర్థిక, హొమ్ శాఖలు తప్పించి అన్ని శాఖల మంత్రులుగా పనిచేశారు. పుదుచ్చేరి ఆధీనంలో ఉన్న ప్రత్యేక పౌరవిమానాయన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న కృష్ణారావు గారు యానాం నియోజకవర్గాన్ని దేశంలోనే అభివృద్ధి తో కూడిన ఆదర్శవంతమైన నియోజకవర్గం గా నిలబెట్టారు. కృష్ణారావు గారు లాంటి శాసనసభ్యులు తమ నియోజకవర్గాలకు ఉండాలి అని కోరుకుంటున్నారు.


You must log in to post a comment.