కర్ర పెండలం:
కర్ర పెండలం దుంప ని ఉడకబెట్టి , అమ్ముతుంటారు .ఇది తినే వాళ్ళు చాలా ఇష్టం గా తింటారు . ప్రయాణాల్లో చాలా సేపు ఆకలి వేయకుండా వుంటుంది. దీనిలో పీచు పదార్థాలు, పోషక పదార్థాలు లభిస్తాయి.
సగ్గుబియ్యం కర్ర పెండలం తో తయారు చేస్తారు.
కర్రపెండలం తో సగ్గు బియ్యంతయారు చేస్తారు. సామర్లకోట లో వీటి తయారీ ఎక్కువ. ఇక్కడ ఎక్కువగా కర్రపెండలం పండిస్తారు.
సగ్గుబి్యంతో హల్వా తయారుచేస్తారు. పాయసం చేస్తారు. సగ్గబియ్యంతో వేసవిలో జావ కాచు కుంటారు. బియ్యప్పిండి వడియాలు, గుమ్మడి వడియాలు లో వేసి, ఇంకొంచెం అందం గా ఉండడానికి వాడతారు. సగ్గుబియ్యం తోనే వడియాలు పెడతారు.
చిప్స్:
నీళ్ళ లో వుప్పూ వేసి, కర్ర పెండలం చిప్స్ గా తరిగి,వాటిలో వేసి ,కొంచెం వుడికించి, తీసి ఎండ లో బాగా , ఎండ బెట్టాలి. వాటిని కావలిసి నప్పుడు వేపుకుని తినవచ్చు. మంచి రుచి గా వుంటాయి.
అప్పడాలు:
అప్పడాల రుచి మాత్రం తింటేనే వాటి రుచి తెలుస్తుంది. అంత బాగుంటాయి. అన్నవరం దగ్గర ఇవి ఎక్కువ గా పండి స్తారు. అక్కడే ఈ అప్పడాల తయారీ వుంది.
కర్ర పెండలం కూర:
ఎక్కువగా బొబ్బర్లు, చిక్కుడు లోని రకాల తో కలిపి ( శ్రీకాకుళం వైపు) వండుకుంటారు. వేపుడు చేస్తారు. పులుసు కూడా పెడతారు. వీటి నీ మిక్సి లో వేసి ,రసం తీసి హల్వా చేస్తారు.
గంజి పొడి:
కర్ర పెండలం తో గంజి పొడి తయారు చేస్తారు.అం తే కాదు . సగ్గుబియ్యం కూడా వుడ క బెట్టి, గంజి తయారీ చేసి, చీరలకు పెట్టుకుంటారు.
వీటికి సంబంధించిన చిన్న పరిశ్రమలు సామర్లకోటలో వున్నాయి.
You must log in to post a comment.