సద్గురు జగ్గీ వాసుదేవ్ – ఆయన ‘సద్గురు’ గా అందరికీ సుపరిచితులు. ‘సద్గురు’ అనేది ఒక బిరుదు కాదు. ఎవరైనా తమ పాండిత్యం వల్ల ఏదైనా చెప్పగలిగినప్పుడు, మనం వారిని ఎన్నో విధాలా సంబోధిస్తాం. కానీ, ఎవరైతే తమ అంతర్ముఖ అనుభవం వల్ల చెప్పగలుగుతారో వారిని మనం సద్గురు అని అంటాం. సద్గురు ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగి ఇంకా మార్మికుడు. భౌతిక మరియు ఆధ్యాత్మిక పరంగా మానవాళి శ్రేయస్సు కొరకు ఆయన చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా నిర్విరామ కృషి జరుపుతున్నారు.
పురాతన యోగ శాస్త్రాలను సమకాలీన మనస్తత్వాలకు అనుగుణంగా చేయగల ప్రత్యేక సామర్థ్యం సద్గురుకు ఉంది. ప్రాచీన యోగ ప్రక్రియలను ఆధునిక మానవుడికి ఆచరణ యోగ్యంగా, సరళమైన విధానంలో అందుబాటులోకి తీసుకువచ్చి, ప్రపంచ వ్యాప్తంగా ఆయన కోట్లాది మంది జీవితాలను తాకారు.
అందరికీ ఆధ్యాత్మికను అందించే సంకల్పంతో… ప్రతి మనిషీ, తనకు ప్రగాఢమైన ఆత్మ పరిణామాన్ని తద్వారా ఆరోగ్యం ఇంకా శ్రేయస్సును కలిగించగల సాధనాల ద్వారా సాధికారతను పొందాలనేది సద్గురు యొక్క ఆకాంక్ష ఇంకా సంకల్పం.
ఆధ్యాత్మిక పరివర్తన తీసుకురావాలన్న ఒక నిబద్దతతో సద్గురు 1992లో ఈశా ఫౌండషన్ ను స్థాపించారు. ఇది లాభాపేక్ష లేకుండా వాలంటీర్లచే నిర్వహించబడే సంస్థ. మానవ సామర్థ్యాన్ని పెంపొందిచేందుకు ఇది అంకితమైంది.
ఈశా పౌండేషన్ ప్రధాన కేంద్రం కోయంబత్తూరు దగ్గర వెల్లంగిరి పర్వత పాదాల వద్ద నెలకొల్పబడింది, మరొక ప్రధాన కార్యాలయం ఈశా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్, అమెరికా దేశంలోని టెన్నిసీ రాష్ట్రంలో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 300 సెంటర్లలో 90 లక్షల మంది వాలంటీర్లచే ఈశా ఫౌండేషన్ నిర్వహించబడుతోంది.
సద్గురు రూపొందించిన ప్రాథమిక స్థాయి కార్యక్రమం ఇన్నర్ ఇంజినీరింగ్ (Inner Engineering), లోతైన పరివర్తన కోసం, ఒక తేలికైన ఇంకా శక్తివంతమైన క్రియ (అంతర్గత శక్తి ప్రక్రియ) శాంభవీ మహా ముద్రను పరిచయం చేస్తుంది. మానవ శ్రేయస్సు కోసం, ప్రధానంగా రూపొందించిన ఇన్నర్ ఇంజినీరింగ్ కార్యక్రమం, ఈ సంస్థ కార్యకలాపాలకు పునాది. ఈ కార్యక్రమంలో యోగ విజ్ఞానం ద్వారా మన శరీరం, మనస్సు, శక్తుల యొక్క సామర్థ్యాన్ని పరమోన్నత స్థాయికి చేర్చే సాధనాలు అందించబడతాయి.
సద్గురు చేపట్టిన పరివర్తన కార్యక్రమాలు, ప్రంపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలను ప్రగాఢంగా స్పృశించాయి.
ధ్యానలింగ ప్రతిష్ఠాపన
1999 జూన్ 24 వ తేదీన సద్గురు ధ్యానలింగ ప్రాణ ప్రతిష్ఠ చేసారు. పదిహేను వేల సంవత్సరాల పూర్వం పురుడు పోసుకున్న ఈ మహోన్నత కార్యం, ఎంతోమంది యోగులకు, జ్ఞాన సిద్ధులకు ఒక కలలాగే మిగిలిపోయింది. ధ్యానలింగ ఇతిహాస గాధను సద్గురు మాటల్లోనే వినండి.
ఈ ఆశ్రమానికి కేంద్ర బిందువు ధ్యానలింగం. ఏ మతానికీ నమ్మకానికీ చెందని ఒక ధ్యాన మందిరం ఈ ప్రదేశం.
ఈ ధ్యానలింగాన్ని ప్రాణప్రతిష్ఠాపన చెయ్యడం వెనకాల ఉన్న ఆలోచన అంతరార్థం ఏమిటంటే, మేము ఇలా ధ్యానం బోధిస్తూ వెళితే, మీరు ఎంత మందికి భోధించగలరు? దానికి ఒక పరిమితి ఉంటుంది. కాని ధ్యానలింగం కోట్లమందికి ఒక మాటైనా మాట్లాడకుండానే యోగాన్ని భోధించగలదు. ఇక్కడ కూర్చున్న అందరూ ధ్యానంలోకి వెళతారు. అదే దాని విశిష్టత. – సద్గురు
ఈ ధ్యానలింగ ప్రదేశంలో ఊరికే నిశ్శబ్దంగా కూర్చుంటే చాలు. ధ్యానం అంటే తెలియని వారికి కూడా, ఆ లింగం నుండి ఉద్భవించే ఆధ్యాత్మిక శక్తివల్ల, అద్భుతమైన, లోతైన ధ్యాన అనుభూతి కలుగుతుంది.
సద్గురు మాటల్లో చెప్పాలంటే, ధ్యానలింగం పరిసరాల్లోకి వచ్చినవారెవరైనా సరే, వారిలో ఆధ్యాత్మిక బీజం నాటుకుంటుంది. అదే వారిని ముక్తి మార్గంపై నడిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఇతర ప్రతిష్ఠించడిన స్థలాలు కూడా, అంతఃశోధనకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి.
ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా, సద్గురు సృజించిన ఈశా యోగా కేంద్రం అన్నీ యోగా పద్ధతులకు నిలయం. హఠ యోగా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం లాంటి విశేష కార్యక్రమాలు, మన జీవితాల్లోకి, ప్రాచీన యోగా సాంప్రదాయాన్ని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు.
“యోగా విధానంలోని సాంస్కృతిక హంగులను తొలగించి, మానవ శ్రేయస్సుకు శుద్ధమైన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంగా దానిని అందించడమే నా పని.” ~ సద్గురు
అంతరంగ పరివర్తన మరియు సామాజిక స్పృహతో చేపట్టిన స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాల కోసం శక్తివంతమైన యోగా కార్యక్రమాల ద్వారా, ఈశా ఫౌండేషన్ మానవ శ్రేయస్సు యొక్క అన్ని అంశాలను పరిష్కరించడం కోసం అంకితమైన భారీ ఉద్యమాన్ని సృష్టించింది.
సామాజిక పునరుజ్జీవనం, విద్య మరియు పర్యావరణంపై దృష్టి సారించిన అనేక ప్రాజెక్టులను సద్గురు ప్రారంభించారు, దీని ద్వారా లక్షలాది మందికి పేదరికాన్ని అధిగమించడానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మరియు సమాజ-ఆధారిత, స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి మార్గం చూపబడింది.
వాటిగురించి క్లుప్తంగా…
గ్రామీణ పురోభివృద్ధి (Action for Rural Rejuvenation) అనేది కొన్ని వేల గ్రామాల్లో పునరుత్తేజం నింపి, ఆరోగ్య సహాయం, సామాజిక పునరావాసం, మానవ అభ్యున్నతులను అందించే కార్యక్రమం.
గ్రామాల్లో, వివిధ గ్రామాల మధ్య క్రీడా పోటీలు నిర్వహిస్తూ( ఈశా గ్రామోత్సవం), ప్రజలలో ఆనందం నింపి, వ్యసనాలను తగ్గించి, జాతి, కుల, మత భేదాలు లేని, సామాజిక బంధాలు పెంచుతోంది. ఇప్పటివరకూ పేదరికాన్ని అనుభవిస్తున్న దక్షిణ భారతదేశపు 4600 గ్రామాలలోని 70 లక్షల మంది ఈ కార్యక్రమం ద్వారా లబ్దిపొందారు.
ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్ (Project Green Hands) అడవుల నిర్మూలనను ఎదుర్కోవడానికి, 114 మిలియన్ మొక్కలను నాటి, తమిళనాడులోని పచ్చదనాన్ని, 33 శాతానికి పెంచే ఒక బృహత్తర కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎన్నో పురస్కారాలను అందుకుంది.
పచ్చదనాన్ని పెంచేందుకు చేస్తున్న కృషిలో భాగంగా ఏర్పాటుచేసిన 35 నర్సరీల ద్వారా, ఒక ఏడాదికి 35 లక్షల సంఖ్యలో, 60 విభిన్న జాతుల మొక్కలను పెంచి, నాటడం జరుగుతుంది. ఒక్కరోజులో అత్యధిక మొక్కలు (8,52,587) నాటినందుకు గానూ ఇది గిన్నిస్ రికార్డ్ నెలకొల్పింది.
ఈశా విద్య (Isha Vidhya) తక్కువ ఖర్చులో నాణ్యమైన విద్యను అందించడం ద్వారా నిరుపేద గ్రామీణ బాలలకు సాధికారతను కల్పించి, వారి జీవితాలలో పరివర్తన తీసుకురావడం కోసం ఆదర్శంగా నిలిచే ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. పది పాఠశాలలు స్థాపింపబడగా, ఈ రోజు వాటి ద్వారా 8500 మంది విద్యార్ధులు ప్రయోజనం పొందుతున్నారు. వారిలో స్కాలర్షిప్ సహకారం పొందేవారు 60% ఉండగా, వీరిలో ఎక్కువ మంది విద్యాభ్యాసం చేస్తున్న మొదటితరం వారు.
నదుల రక్షణ (Rally For Rivers)
నదుల రక్షణ అనేది భారత జీవనాడులైన నదులను సంరక్షించేందుకు 2017లో సద్గురు ప్రారంభించిన ఉద్యమం.
నదుల దయనీయ స్థితిపై అవగాహన పెంపొందించేందుకు స్వయంగా 16 రాష్ట్రాల గుండా 9300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. 16 కోట్ల 20 లక్షల మంది ప్రజల మద్దతు దీనికి లభించగా, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ ఉద్యమంగా నిలిచింది.
కావేరీ కాలింగ్ –(Cauvery Calling)
కావేరీ కాలింగ్ అనేది ఒక ఉద్యమం. భారతదేశ నదులను పునరుజ్జీవింపజేయడానికి సహాయపడే ప్రమాణాలను ఇది సూచిస్తుంది. ఇది కావేరీ నది పునరుజ్జీవన ప్రక్రియని ప్రారంభించి, తద్వారా 8.4 కోట్లమంది ప్రజల జీవితాలను మార్చనుంది.
కావేరి కాలింగ్ అనేది, నాకూ, నాతో ఉన్నవారికీ పన్నెండు సంవత్సరాల సంకల్పం. ఈ ఒక్కటి మీరు నెరవేర్చితే, ఈ ప్రపంచానికి మీరు చేయవలసింది చేసినట్లే – సద్గురు
ఈ ప్రాజెక్టులతో పాటు దేశ యువతలో చైతన్యం కలిగించేందుకు 2018 లో ‘యువతా సత్యం తెలుసుకో’ (Youth And Truth) పేరుతో అవగాహనా కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలు, కళాశాలను సందర్శించి, వివిధ అంశాలకు సంబంధించి యువతీయువకుల సందేహాలు, వారు ఎదుర్కొంటున్న సవాళ్లపై వారిలో స్పష్టత, సమతుల్యతను తీసుకువచ్చి, తమలో ఉన్న శక్తిని పూర్తిగా వినియోగించుకునేందుకు ప్రేరణ కల్పించే ప్రయత్నం చేశారు
యువతలో అపారమైన శక్తి ఉందని చెబుతూ, వారు తమ శక్తిని నిర్మాణాత్మకంగా వినియోగించుకోగలిగితే సాధ్యమయ్యే అద్భుతాల గురించి తెలియజెప్పారు.
నిర్విరామంగా సాగుతున్న ప్రస్థానం
క్రియాశీలకమైన , అంకితమైన వాలంటీర్ల సహకారంతో ఫౌండేషన్ కార్యకలాపాలు, ప్రపంచ వ్యాపంగా మానవ సాధికారతకు ఇంకా సామాజిక పునరుద్ధరణకు, అభివృద్ధి చెందుతున్న నమూనాగా ఉపయోగపడుతున్నాయి.
ప్రతీ మనిషికీ కనీసం “ఒక చుక్క ఆధ్యాతికత(One drop of spirituality)” ను అందించాలనే సంకల్పంతో చేస్తున్న ఈ కృషి, 38 సంవత్సరాలుగా ప్రజ్జ్వలిస్తూనే ఉంది.
ఆయన వాక్చాతుర్యం ఇంకా పదునైన తర్కం మన ఆలోచనలను, జీవితం పట్ల మన దృక్పథాన్ని విస్తరించేలా చేస్తాయి.
దేశంలో బాగా పలుకుబడి కలిగిన ప్రముఖ 50 మందిలో ఒకరుగా ఆయన గుర్తించబడ్డారు.
సద్గురు సామాజిక ఆర్థిక అభివృద్ధి, నాయకత్వం మరియు ఆధ్యాత్మికత వంటి విభిన్న సమస్యలను ఉద్దేశించి, ఐక్యరాజ్యసమితి మరియు ప్రపంచ ఆర్థిక వేదిక(World Economic Forum)తో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రధాన వేదికలలో ప్రభావవంతమైన వాణిని వినిపించారు.
హార్వర్డ్, యేల్, ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్, వార్టన్ మరియు MIT లతో సహా ప్రముఖ విద్యాసంస్థలలో మాట్లాడేందుకు ఆయనను తరచూ ఆహ్వానిస్తారు.
మానవాళి యొక్క భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సుకోసం అంకితమైన సద్గురు, జీవితం మరియు జీవనం పై ఆయనకు ఉన్న దృక్పథం, తనకు తారసపడే వాళ్ళని సమ్మోహితుల్ని చేసి, సవాలు విసిరి వాళ్ళని ఆశ్చర్యచకితుల్ని చేయడంలో ఎన్నడూ విఫలం కాలేదు.
అవార్డులు – పురస్కారాలు :
- పద్మవిభూషణ్ అవార్డు – ఆధ్యాత్మిక రంగంలో ఆయన చేసిన అసాధారణమైన మరియు విశిష్ట సేవ చేసినందుకుగానూ ఫిబ్రవరి 2017లో ఇవ్వబడిన అత్యుత్తమ వార్షిక పౌర పురస్కారాలలో ఒకటి.
- న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ జాబితాలో ఇన్నర్ ఇంజనీరింగ్: ఏ యోగి’స్ గైడ్ టు జాయ్, సెప్టెంబర్ 2016
- ఐక్యరాజసమితి తాలూకు ఆర్ధిక మరియు సామాజిక కౌన్సిల్ లో స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్
- ఇండియా టుడే మ్యాగజైన్ చేత సద్గురు దేశంలో బాగా పలుకుబడి కలిగిన ప్రముఖ 50 మందిలో ఒకరుగా గుర్తించబడ్డారు.
- ఇందిరాగాంధీ పర్యావరణ పురస్కారం – భారతదేశపు అత్యుత్తమ పర్యావరణ పురస్కారం
- గిన్నిస్ ప్రపంచ రికార్డు – ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్ లో భాగంగా మూడురోజుల వ్యవధిలో 8,00,000 చెట్లను నాటినందుకు
- ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ కు – ఇండియాటుడే అందించిన సఫైగిరీ అవార్డు.
ప్రముఖ రచనలు
1. Inner Engineering: A Yogi’s Guide to Joy, Telugu Edition (ఇన్నర్ ఇంజినీరింగ్: యోగం ఆనంద మార్గం)
2. Death; An Inside Story: A book for all those who shall die
3. Mystic’s Musings(మర్మజ్ఞ విలాసం)
4. Life and Death in One Breath
5. Adiyogi: The Source of Yoga
6. Don’t Polish Your Ignorance …It May Shine
7. Emotion and relationships ( భావాలు అనుబంధాలు)
8. Joy 24 x 7 (ఆనందం 24X7)
“ప్రేమ, వెలుగు, ఆనందంతో నిండిన ప్రపంచం, దానికి ఇదే సమయం. రండి, మనం దీన్ని సాకారం చేద్.
ఈశా ఫౌండేషన్
సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు ఈశా ఫౌండేషన్ ని స్థాపించారు. కోయంబతూర్ లో ఉన్న వెల్లంగిరి కొండల కింద ఈ అందమైన ఆశ్రమం నిర్మింపబడింది. ఇక్కడ ధ్యానం, యోగ, హటయోగ వంటి ప్రక్రియలు నేర్పిస్తారు. వాటిలో ముఖ్యమైనది ‘ఇన్నర్ ఇంజనీరింగ్’, దీనిలో శాంభవి మహాముద్ర నేర్పిస్తారు.అంతే కాకుండా, ఇక్కడ ధ్యానలింగం, దేవి గుడి, ఆదియోగి ఆలయం కూడా నిర్మించారు సద్గురు. వీటితో పాటుగా ఇక్కడ తీర్థకుండాలు ఉన్నాయి. వాటిని చంద్రకుండ్(ఆడవారికి), సూర్యకుండ్(మొగవారికి) అని పిలుస్తారు. ఇవి పవిత్ర స్నానాలు.
2017 లో ప్రపంచంలోనే అతి పెద్దది అయిన ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అది 112 అడుగుల ఎతైన విగ్రహం. 2021 లో కాల భైరవ గుడిని నిర్మించారు. ఈ గుడిలో కాలభైరవుడు ఈషా ఆశ్రమానికి కాపల. ప్రతి ఏట ఆశ్రమంలో మహాశివరాత్రి మరియు దేవి నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతాయి. అలాగే ప్రతి నెలా మాస శివరాత్రి, అమావాస్య మరియు పౌర్ణమి నాడు ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు జరుగుతాయి.కోయంబతూరుకి పడమర దిక్కులో 30 కిలోమీటర్ల దూరం లో ఆశ్రమం ఉంది. ఇక్కడ చేరడానికి బస్సులు, టాక్సీలు ఉన్నాయి.
ఈశా యోగా కేంద్రం
ఈశా యోగా లో ఏమి నేర్పిస్తారు
ఈశా ఫౌండేషన్ 1992లో కోయంబత్తూరులోని వెల్లెంగిరి పర్వత పాదాల వద్ద సద్గురుచే స్థాపించబడింది. ఇది లాభాపేక్ష లేకుండా పూర్తిగా వాలంటీర్లచే నిర్వహింపబడుతున్న సంస్థ. ఇక్కడ యోగాని దాని పూర్తి లోతుల్లో, సంపూర్ణ విస్తృతితో అనుభూతి చెందే స్థాయిలో బోధిస్తారు. ఈ కార్యక్రమాలు మనిషి, సంపూర్ణమైన ఇంకా సజీవమైన జీవన విధానంలో తనని తాను నిర్మించుకునే విధానాలను అందిస్తాయి. ఆధ్యాత్మిక జీవితం అంటే ప్రాపంచికమైన, సామాజిక పరమైన ఇంకా కుటుంబ సంబంధమైన బాధ్యతల నుండి తప్పుకు పోయేది కాకుండా వాటిని వ్యక్తిగత ఎదుగులకు, ఆత్మ సాక్షాత్కారానికి వాహనాలుగా చేసుకోవడం అని ఇది నిరూపిస్తుంది.
ఈశా యోగా కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేంద్రాలలో తరచూ నిర్వహించబడుతూ ఉంటాయి. ప్రతీ కార్యక్రమం గురించి ఇచ్చిన వివరాలతో పాటు లింక్ లను జతచేయడం జరిగింది. అవేమిటో చూద్దాం.
ఇన్నర్ ఇంజనీరింగ్ (Inner Engineering)
సద్గురు రూపొందించిన ప్రాథమిక స్థాయి కార్యక్రమం ఇన్నర్ ఇంజినీరింగ్ (Inner Engineering), లోతైన పరివర్తన కోసం, ఒక తేలికైన ఇంకా శక్తివంతమైన క్రియ (అంతర్గత శక్తి ప్రక్రియ) శాంభవీ మహా ముద్రను పరిచయం చేస్తుంది. మానవ శ్రేయస్సు కోసం, ప్రధానంగా రూపొందించిన ఇన్నర్ ఇంజినీరింగ్ కార్యక్రమం, ఈ సంస్థ కార్యకలాపాలకు పునాది. ఈ కార్యక్రమంలో యోగ విజ్ఞానం ద్వారా మన శరీరం, మనస్సు, శక్తుల యొక్క సామర్థ్యాన్ని పరమోన్నత స్థాయికి చేర్చే సాధనాలు అందించబడతాయి. ఈ ప్రోగ్రాములో 21 నిమిషాల శాంభవి మహాముద్ర ఉపదేశం జరుగుతుంది. ఎంతో అద్భుతమైన పరివర్తన తీసుకువచ్చే ఈ శాంభవి మహాముద్ర ప్రక్రియను, సద్గురు ఆధునిక ప్రపంచానికి అందించారు.
ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్ ((Inner Engineering Online)
మీకు వీలైనంత సమయంలో, ఎక్కడినుంచైనా సద్గురుతో ఇన్నర్ ఇంజినీరింగ్ ను అనుభూతి పొందండి. ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్ లో 7 సెషన్స్ ఉంటాయి. ఒక్కో సెషన్ 90-నిమిషాల నిడివి కలిగి ఉంటుంది.
ప్రాచీన యోగశాస్త్రాల నుండి గ్రహించబడి, సరాసరి మీరు జీవించే, జీవితాన్ని నిర్వహించుకునే మరియు అనుభూతి చెందే విధానంలో పరివర్తన తీసుకురాగల సమర్ధత కలిగిన శక్తివంతమైన సాధనాలు అందించబడతాయి. ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్ గురించి మరింత సమాచారం ఇంకా రిజిస్ట్రేషన్ వివరాల కోసం ఇక్కడ చూడండి.
ఇన్నర్ ఇంజినీరింగ్ ముగింపు (Inner Engineering Completion)
ఇన్నర్ ఇంజినీరింగ్ ముగింపు కార్యక్రమం, ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేయబడిన నగరాలలో స్వయంగా సద్గురుచే అందించబడుతుంది. ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్ పూర్తి చేసిన వారికి అందుబాటులో ఉంటుంది.
ఈ రెండు రోజుల కార్యక్రమంలో శాంభవీ మహాముద్ర క్రియ 21- నిమిషాల శక్తిమంతమైన శుద్ధీకరణ ప్రక్రియ అందించబడుతుంది. దానిలో శ్వాస ప్రక్రియ, పునరుత్తేజం మరియు శక్తివర్ధకం చేసే సన్నాహక ఆసనాలు ఉంటాయి. సద్గురుతో ఈ కార్యక్రమం హాజరుకాలేని వారికి కూడా, ఇన్నర్ ఇంజనీరింగ్ ముగింపు కార్యక్రమం, సుశిక్షితులైన ఈశా యోగ బోధకులచే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని ఈశా నగర కేంద్రాలలో తరచుగా అందించబడుతుంది.
అర్హత: ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ చేసి ఉండాలి.
ఈ కార్యక్రమం గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
ఉప యోగా (Upa Yoga)
ఉపయోగా అంటే ప్రాధమికంగా “యోగాలో ఉప భాగం” లేదా “యోగాకు ముందు భాగం” అని అర్థం. ఈ కార్యక్రమం కీళ్ళు, కండరాలు ఇంకా శక్తి వ్యవస్థలను ఉత్తేజపరచడం ద్వారా మొత్తం వ్యవస్థలో హాయిని తీసుకువచ్చే సులభమైన మరియు శక్తిమంతమైన 10 అభ్యాసాల క్రమాన్ని అందిస్తుంది. ఇది శరీరంలో శక్తి స్తబ్దుగా ఉండకుండా చేసి మొత్తం వ్యవస్థలో అనాయాస స్థితిని తీసుకువస్తుంది.
మానవ శరీరంలో శక్తి 72000 మార్గాల గుండా ప్రవహిస్తుంది. వీటినే నాడులు అంటాము. కీళ్ళ భాగాల్లో అనేక నాడులు కలుసుకొని కేంద్రీకృతమౌతాయి కాబట్టి, కీళ్ళు శక్తి నిక్షిప్త కేంద్రాలుగా ఉంటాయి. ఉపయోగా అనేది ఈ శక్తిని ఉత్తేజపరిచి, కీళ్ళలోని ఘర్షణని తొలగించి తక్షణ చురుకుదనాన్ని ఇంకా సజీవత్వాన్ని తీసుకువస్తుంది. కొత్తగా యోగా చేసేవారు వీటితో మొదలు పెట్టడం మంచింది, ఇతర యోగ సాధనలు చేయడానికి ముందస్తు ప్రక్రియగా వీటిని చేయవచ్చు.
శరీరం పనిచేసే విధానంపై సక్లిష్టమైన అవగాహనతో ఉపయోగా ఈ కింది ప్రయోజనాలను చేకూరుస్తుంది.
- శారీరక ఒత్తిడి ఇంకా అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది.
- కీళ్ళను, కండరాలను బలోపేతం చేస్తుంది.
- చాలా గంటల పాటు స్తబ్దంగా ఉన్న తరువాత శరీరాన్ని పునరుద్ధరిస్తుంది.
- జెట్ లాగ్ ఇంకా సుదీర్ఘ ప్రయాణాలు శరీరంపై ప్రభావం చూపకుండా చేస్తుంది.
ఉపయోగా గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హఠ యోగా (Hatha Yoga)
వేల సంవత్సరాలుగా ఒక యోగ సాంప్రదాయం ద్వారా సంపూర్ణ స్వచ్ఛతతో, సచేతనత్వంతో కొనసాగించబడుతూ వచ్చిన అభ్యాసాలను నేర్చుకునేందుకు ఈశా హఠ యోగా కార్యక్రమాలు సరి సాటిలేని అవకాశంగా నిలుస్తున్నాయి. సుశిక్షితుడైన బోధకులచే, సాంప్రదాయ హఠ యోగా దాని పూర్తి లోతు ఇంకా విస్తృతితో అందించబడుతుంది.
మేము హఠయోగాను పరివర్తన తీసుకువచ్చే విధానంలో బోధిస్తాము.ఈ పరివర్తన శరీర స్థాయిలోనే కాదు, మీరుండే విధానంలో కూడా. – సద్గురు
సాంప్రదాయ హఠ యోగా(Classical Hatha Yoga) ను శరీరం, మనస్సు పై పట్టు సాధించి, తద్వారా ఆరోగ్యం, ఆనందం ఇంకా పరవశాన్ని అందించే ఒక సంపూర్ణ ప్రక్రియగా ఈశా ఫౌండేషన్ సమర్పిస్తుంది.
ఈశా 4 సాంప్రదాయ హఠ యోగా కార్యక్రమాలను అందిస్తుంది.
అంగమర్ధన
సూర్యక్రియ
యోగాసనాలు
భూతశుద్ధి
అంగమర్ధన (Anga Mardhana)
అంగమర్ధన – యోగా వ్యవస్థపై ఆధారితమైన వ్యాయామ వ్యవస్థ. ఇది శరీరాన్ని బలోపేతం చేయడం ద్వారా అత్యుత్తమ శారీరక ఇంకా మానసిక ఆరోగ్యాన్ని పొందే అవకాశాన్ని అందరికీ కల్పిస్తుంది. “అంగమర్ధన” అంటే కాళ్ళుచేతులు, అవయవాలు ఇంకా శరీరంలోని ఇతర భాగాలపై పూర్తి ఆదిపత్యాన్ని సాధించడం. పేరుకి తగ్గట్టుగానే, దీనిని అభ్యాసం చేయడం ద్వారా కండరాలు, ప్రసరణ వ్యవస్థ, అస్థి పంజరం, నాడీ వ్యవస్థ ఇంకా ప్రాధమిక శక్తి వ్యవస్థలతో సహా శరీరాన్ని అన్ని స్థాయిల్లోనూ పునరుద్ధరిస్తుంది.
“మానవ శరీర వ్యవస్థలో పరమోన్నత స్థాయి ఆరోగ్యం, శ్రేయస్సుకు తీసుకువచ్చేందుకు, ఇంకా అన్నిటికీ మించి సంపూర్ణమైన మానవుడిగా వికసించేందుకు అంగమర్ధన ఒక శక్తివంతమైన విధానంగా పనిచేస్తుంది.” – సద్గురు
అందరికీ నప్పేలా, అందరూ ఆచరించగలిగేలా సద్గురు ఎంపిక చేసిన అభ్యాసాలతో కూడిన అంగ మర్ధన కోసం ఏవిధమైన వ్యాయామ పరికరాలూ అవసరం లేదు. దానికి కావాల్సింది శరీరమే ఇంకా దానిని ఎక్కడైనా, ప్రయాణంలో కూడా సాధన చేయవచ్చు.
ప్రయోజనాలు:
- వెన్నెముక, ఆస్థి మరియు కండరాల వ్యవస్థలను బలోపేతం చేస్తుంది.
- శారీరక దృఢత్వాన్ని ఇంకా పటుత్వాన్ని పెంపొందిస్తుంది.
- శరీరాన్ని బలోపేతం చేసి, తేలికదనం ఇంకా ఉల్లాసాన్ని తీసుకువస్తుంది.
- హఠ యోగా కోసం శరీరాన్ని సన్నద్ధం చేస్తుంది.
అంగమర్ధన గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
సూర్య క్రియ (Surya Kriya)
సూర్యక్రియ అంటే ఏమిటి?
సూర్యక్రియ ఆరోగ్యం, శ్రేయస్సు ఇంకా అంతర్గత శ్రేయస్సు కొరకు సంపూర్ణమైన ప్రక్రియగా రూపొందించబడిన శక్తివంతమగు అతి ప్రాచీనమైన యోగ సాధన క్రియ. “సూర్య” అంటే “సూర్యుడు”, “క్రియ” అంటే “అంతర్గత శక్తి ప్రక్రియ.” సూర్యక్రియ మణిపుర చక్రాన్ని (Solar Plexus) ఉత్తేజపరిచి, మీ వ్యవస్థలోని ‘సమత్ ప్రాణ’ని, అంటే మీ శరీర వ్యవస్థలోని సౌర తాపాన్ని ప్రేరేపిస్తుంది. అంతేకాక మనిషిలోని ఈడా మరియు పింగళ నాడులను సమతులం చేసి, తద్వారా శారీరక స్థిరత్వం ఇంకా మానసిక నిశ్చలతలను చేకూర్చుతుంది. ఈ దృఢమైన పునాది, జీవితపు ఉన్నత పార్శ్వాలను అన్వేషించడానికి ఆధారభూతమౌతుంది.
“సూర్యక్రియ అనేది మీలో అంతర్గతంగా ఉన్న సూర్యుడిని ఉత్తేజపరిచే ఒక శక్తివంతమైన ప్రక్రియ.” – సద్గురు
సాంప్రదాయకంగా కొన్నిప్రత్యేక వర్గాలకు చెందిన యోగులకు మాత్రమే అందుబాటులోఉంటూవచ్చిన ఈ సూర్యక్రియను, ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచానికి తగిన విధంగా సమగ్ర ఆధ్యాత్మిక సాధనగా సద్గురు అందిస్తున్నారు.
ప్రయోజనాలు:
- మానసిక స్పష్టత మరియు ఏకాగ్రతను పెంపొందిస్తుంది.
- బలహీన పడిన శరీరాన్ని బాగుచేస్తుంది.
- చురుకుదనాన్ని, సజీవత్వాన్ని పెంపొందిస్తుంది.
- శరీర హార్మోనుల స్థాయిని క్రమబద్దీకరిస్తుంది.
- గాఢమైన ధ్యాన స్థితులను పొందేందుకు సన్నద్ధం చేస్తుంది.
సూర్యక్రియ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
యోగాసనాలు (Yogasanas)
ఆసనం అంటే ఒక భంగిమ అని అర్ధం. మన శరీరం అసంఖ్యాకమైన భంగిమలను తీసుకోగలదు. వీటిలో 84 భంగిమలు ‘యోగాసనాలు‘ గా గుర్తించబడ్డాయి. తద్వారా శరీరాన్ని, మనస్సుని అంతిమమైన శ్రేయస్సుకు అవకాశంగా మార్చడం సాధ్యపడుతుంది. యోగాసనాలంటే వ్యాయామం కాదు, మనిషిలోని శక్తిని ఒక నిర్ధిష్ట దిశలో పరివర్తన చెందించగల సూక్షమైన ప్రక్రియలు. శక్తి యొక్క ఉన్నత పార్శ్వాలను తట్టుకునే సామర్థ్యాన్ని శరీర వ్యవస్థ పొందేందుకు, ఒక 36 శక్తివంతమైన భంగిమలు (లేదా) యోగాసనాలుగా హఠయోగాలో అందించబడతాయి.
“ఎరుకతో మీరు ఒక్క ఆసనంలో ఉండగలిగితే, అది మీ ఆలోచనలు, భావాలు ఇంకా మీరు జీవితాన్ని అనుభవించే విధానాన్ని మార్చ గలదు. హఠయోగాకు ఆ సామర్థ్యం ఉన్నది.” – సద్గురు
ఏ విధమైన శిక్షణా లేనప్పుడు, మానవ శరీరం వివిధ స్థాయిలలో నిర్భందతను సంతరించుకుంటుంది. ఎరుకతో శరీరాన్ని నిర్థిష్టమైన భంగిమలో ఉంచటం ద్వారా, శక్తి ప్రవాహానికి అనుకూలమైన మార్గం ఏర్పాటుచేసి, తద్వారా మనిషిలోని చైతన్యాన్ని జాగృతం చేయగలము. యోగాసనాలు అంతర్గత వ్యవస్థను , ఖగోళ జ్యామితితో అనుసంధానం చేసేందుకు గల ఒక విధానం. తద్వారా మిగిలిన సృష్టితో సమన్వయంలో ఉండడంతో పాటు సహజంగానే ఆరోగ్యదాయకమైన, ఆనందదాయకమైన రసాయనికతను సాధించడమే కాకుండా అన్నింటికీ మించి సమతౌల్యత కలుగుతుంది.
ప్రయోజనాలు
- దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలనుండి ఉపశమనం
- ఉన్నత సంభావ్యత దిశగా శరీరం, మనస్సు పరిణామం చెందడం.
- శరీరం,మనసు ఇంకా శక్తి వ్యవస్థను సుస్థిరం చేయడం.
- వయసు పైబడడం నిదానిస్తుంది.
యోగాసనాలు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
భూతశుద్ధి (Bhuta Shuddhi)
భౌతిక కాయంతో సహా, సమస్త సృష్టికీ మూలమైనది ఐదు మూలకాల సముదాయం. అవే భూమి, నీరు, వాయువు, అగ్ని ఇంకా ఆకాశం. మానవ దేహంలోని ఈ ఐదు మూలకాలను శుద్ధీకరించడం ద్వారా శారీరక మరియు మానసిక శ్రేయస్సు నెలకొంటుంది. ఈ ప్రక్రియే శరీరాన్ని, పరమోన్నత శ్రేయస్సుకు సోపానంగా కూడా మలుస్తుంది.
భూతశుద్ధి అనబడే ఒక సంపూర్ణ యోగ వ్యవస్థే ఉంది. అంటే “మూలకాలను శుద్ధీకరించడం”. ఈశా అందించే భూతశుద్ధి ప్రక్రియ అనేది తీవ్ర సాధన చేస్తేగానీ అందని ప్రయోజనాన్ని, ఈ నిగూఢమైన యోగ శాస్త్ర విజ్ఞానం ద్వారా అందరూ పొందేందుకు గల ఒక అరుదైన అవకాశం.
ప్రయోజనాలు
- వ్యవస్థలో సామరస్యాన్ని ఇంకా సమతౌల్యాన్ని నెలకొల్పుతుంది.
- ప్రగాఢమైన శక్తి స్థాయిలకు నిలువగలిగేలా వ్యవస్థను సన్నద్ధం చేస్తుంది.
- భౌతిక శరీరం, మనస్సు ఇంకా శక్తి వ్యవస్థల సామర్థ్యాలను పెంపొందిస్తుంది.
- మానవ శరీర వ్యవస్థపై పూర్తి ఆదిపత్యాన్నిసాధించేందుకు పునాదిని ఏర్పరుస్తుంది.
భూతశుద్ధి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
భావ స్పందన (Bhava Spandana)
భావ స్పందన సద్గురుచే రూపొందించబడిన ఉన్నత శ్రేణి ధ్యాన కార్యక్రమం. అది శరీర, మానసిక పరిమితులకు అతీతంగా ఉన్నత స్థాయి చైతన్యావస్థలను అనుభూతి చెందే అవకాశాన్ని ఇస్తుంది.
భావ అనే పదానికి అర్థం “స్పర్శ”. స్పందన అనేదాన్ని ఒకరకంగా “అనునాదం” అని చెప్పవచ్చు. శక్తివంతమైన ప్రక్రియలు ఇంకా ధ్యానాల ద్వారా, భావ స్పందన కార్యక్రమం తీక్షణమైన శక్తితో కూడిన వాతావరణాన్ని కలిపిస్తుంది. తద్వారా వ్యక్తిత్వం (మిగిలిన వారి నుండి వేరు అనే తత్వం), పంచేంద్రియాల పరిధులను అధిగమించి, మిగతా సృష్టి ఉనికితో ఐక్యత, అనునాదంతో ఉండే అనుభవాన్ని సృష్టిస్తుంది. అది అవధుల్లేని ప్రేమ, ఆనందాలతో కూడిన అతిశయమైన అనుభూతిని కలిగిస్తుంది.
“మిమ్మల్నీ, మీ చుట్టూ ఉన్నదానినీ, మీరు అనుభూతి చెందే విధానాన్ని పరివర్తన చేసేందుకు కావలసిన సాధనాలను భావస్పందన అందిస్తుంది. – సద్గురు”
భావస్పందన కార్యక్రమం, ఈశా యోగా కేంద్రంలో 4 రోజుల రెసిడెన్షియల్ కార్యక్రమంగా అందించబడుతుంది.
ఈ కార్యక్రమం పూర్తిగా అనుభూతి పూర్వకమైనది – ఎటువంటి కొత్త అభ్యాసాలూ బోధింపబడవు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటే Isha Yoga/Inner Engineering (శాంభవీ మహాముద్ర క్రియతో కలుపుకుని) పూర్తి చేసి ఉండాలి.
అర్హతలు:
ఈ కార్యక్రమానికి హాజరు కావాలనుకునే వారు ముందుగా ఇన్నర్ ఇంజినీరింగ్ కార్యక్రమం (శాంభవీ మహాముద్ర క్రియతో కలుపుకుని) పూర్తి చేసి ఉండాలి.
భావ స్పందన గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
శూన్య ఇంటెన్సివ్ (Shoonya Intensive)
లోతైన అంతర్గత పార్శ్వాలను అన్వేషించాలనుకునే వారికి, శూన్య ఇంటెన్సివ్ అనేది సధ్గురుచే రూపొందించబడిన ఒక ఉన్నత స్థాయి ధ్యాన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శక్తిచాలన క్రియతో పాటు శూన్య ధ్యానం కూడా బోధించబడుతుంది. శక్తి చాలన క్రియ అనేది శక్తివంతమైన, శుద్ధీకరణ సామర్థ్యం గల అభ్యాసాల కలయిక. అది ప్రాణ శక్తి ప్రసరణను పెంపొందిస్తుంది. శూన్య ధ్యానం అనేది ఎరుకతో కూడిన క్రియారహిత స్థితిని సునాయాసంగా పొందే ప్రక్రియ. ఈ అభ్యాసాలు జీవితంలోని భౌతిక, మానసిక మరియు భావోద్వేగపు అవరోధాలను నుండి విముక్తికి పురిగొల్పి లోతైన అంతర్గత శ్రేయస్సు వైపు మనల్ని నడిపిస్తాయి.
మీ మనసు ఒక సారి పూర్తి నిశ్చల స్థితికి చేరితే మీ మేధస్సు మానవ పరిమితులను దాటుతుంది. – సద్గురు
అన్నీ ఈశా యోగా సమర్పణలూ, ఈ మెళకువలు అన్నీ కూడా పూర్తిగా యోగశాస్త్రాల ఆధారితమై ఉన్నాయి కనుక మతం, జాతి, సామాజిక నేపథ్యం, వయసు, లింగ భేదాలతో నిమిత్తం లేకుండా అందరూ అభ్యసించేందుకు యోగ్యమైనవి.
శూన్య ఇంటెన్సివ్ అనేది కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలోనూ, అమెరికాలోని ఈశా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్ లో 4-రోజుల రెసిడెన్షియల్ కార్యక్రమంగా నిర్వహించబడుతుంది. చాలా అరుదుగా ప్రపంచ వ్యాపంగా ఉన్న వివిధ కేంద్రాలలో కూడా జరుగుతుంది.
అర్హతలు:
ఈ కార్యక్రమానికి హాజరు కావాలనుకునే వారు ముందుగా ఇన్నర్ ఇంజినీరింగ్ కార్యక్రమం (శాంభవీ మహాముద్ర క్రియతో కలుపుకుని) పూర్తి చేసి ఉండాలి.
శూన్య గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
సమ్యమ (Samyama)
సమ్యమ అనేది ప్రత్యేకంగా సద్గురుచే నిర్వహించబడే రెసిడెన్షియల్ కార్యక్రమం. ఇందులో పాల్గొనేవారు ఎనిమిది రోజుల పాటు పూర్తి నిశ్శబ్దంలో ఉంటూ ధ్యానంలో నిమగ్నమౌతారు. సమ్యమ, వ్యక్తులు కర్మ బంధనాల నుండి తమని తాము విముక్తుల్ని చేసుకుని, వ్యవస్థను శుద్ధిచేసి, దివ్యభూమికల అనుభవాన్ని పొందేలా వారిని సంసిద్ధపరచుకునే సంభావ్యతను వారికి కల్పిస్తుంది. ఈ కార్యక్రమం, అందులో పాల్గోనేవారికి, సద్గురు సమక్షంలో, ఉన్నత చైతన్య స్థాయిలను ఇంకా గాఢమైన ధ్యానానుభవ స్థితిని చేరుకునే అవకాశాన్ని అందిస్తుంది.
“సమ్యమ అనేది ఈ శరీరం మీరు కాదు, ఈ మనస్సు మీరు కాదు, చుట్టూ ఉండే ప్రపంచం మీరు కాదు అని పూర్తిగా మీ ఎరుకలోకి వచ్చే స్థితి.” – సద్గురు
ఇది కోయంబత్తూరు ఈశా యోగా కేంద్రంలో నిర్వహింపబడే 8-రోజుల రెసిడెన్షియల్ కార్యక్రమం.
అర్హతలు
సమ్యమకు హాజరుకావాలంటే ముందుగా ఇన్నర్ ఇంజినీరింగ్, భావ స్పందన, శూన్య ఇంకా యోగాసనాలు పూర్తి చేసి ఉండాలి. ఈ కార్యక్రమంపై ఆసక్తి కలవారికి, కార్యక్రమం జరగడానికి రెండు నెలల ముందే ప్రీ- సమ్యమ మీట్ నిర్వహించబడుతుంది.
సమ్యమ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
గురుపూజ (Guru Pooja)
గురుపూజ అనేది స్తోత్రాలు మరియు నివేదనల ద్వారా మీరు నివసించే ప్రదేశంలో శక్తివంతమైన అనుభూతిని సృజించేందుకు గల ఒక నిర్దిష్టమైన విజ్ఞానం. ప్రత్యేకించి ఈ గురుపూజను శోడషోపచార గురుపూజ అంటారు. అంటే గురువుని స్వాగతించేందుకు గల పదహారు విధానాలు. మతపరమైన క్రతువుగా కాకుండా, గురుపూజ అనేది భావోద్వేగాన్ని ఒక ఉపకరణంలా ఉపయోగించి, మన శక్తులలో ఒక రకమైన ప్రచోదనాన్ని కలిగించే ఒక విధానం. అందువల్ల దీనిని రోజూ అభ్యాసం చేయడం ద్వారా ఇది మీ జీవితంలోకి ప్రత్యేక లక్షణాన్ని తీసుకురాగలదు. ఏ మత సాంప్రదాయాలకు చెందిన వారు అనే దానితో నిమిత్తం మహనీయులైన గురువులందరికీ ప్రతీకగా ఒక దీపానికి గురుపూజ సమర్పించబడుతుంది.
గురుపూజ శిక్షణను కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో 4-రోజుల రెసిడెన్షియల్ కార్యక్రమంగా నిర్వహిస్తారు.
అర్హత: ఇన్నర్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
గురుపూజ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈశా హఠ యోగా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం
‘ఈశా హఠ యోగ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం’ అనేది యోగా వ్యవస్దని లోతుగా అర్ధం చేసుకోవడానికి, సాంప్రదాయ హఠ యోగాని నేర్పించడానికి కావలసిన నైపుణ్యాన్ని పొందేందుకు లభించే ఒక అసమానమైన అవకాశం.
సాంప్రదాయ హఠ యోగాని శుద్ధరూపంలో అందించాలి అనేది సద్గురు ఆశయం. అసలైన హఠ యోగాని నేర్పించే యోగా టీచర్లను తయారుచేయటం కోసం ‘ఈశా హఠ యోగా స్కూల్’ వారు 21-వారాల టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అందిస్తున్నారు.
ధ్యానలింగం
పైకి సాదాసీదాగా కనిపించే పైకప్పును(The Dhyanalinga Dome) , ఒక్క స్తంభం కూడా ఆధారంగా లేకుండా కట్టారంటే, మీకు ఆశ్చర్యం కలగక మానదు.
ధ్యానలింగం వెనుక కథ, క్లుప్తంగా…
దీనికి చాలా పెద్ద నేపథ్యమే ఉంది. వివరాలలోకి వెళ్తే, ఆత్మజ్ఞానం పొందినవారందరూ, ఎన్నో తరాలుగా, ఏడూ చక్రాలూ శక్తివంతంగా ఉన్న ఒక లింగంతో ఒక క్షేత్రాన్ని కట్టాలని ఆశించారు. ఒక ధ్యానలింగ ఆలయం. ఎంతో కాలానికి ఆ కలలను సాకారం చేస్తూ 1999, జూన్ 23న సద్గురు (Sadhguru), కోయంబత్తూరు సమీపంలోని వెల్లంగిరి పర్వత పాదాల వద్ద(Velliangiri foot hills) ధ్యానలింగాన్ని స్థాపించారు. ఇది ఈశా యోగా కేంద్రంలో కొలువు తీరింది. ప్రత్యేకించి, ధ్యానలింగ ప్రతిష్ఠాపన ప్రక్రియ కోసం, ఆయనకు మూడు సంవత్సరాల అత్యంత తీవ్ర సాధన అవసరమైంది.
సర్వ ధర్మ స్తంభం ( Sarva Dharma Stambha)
ఆలయంలోకి వెళ్ళే ముందు, సర్వ ధర్మ స్తంభం కనిపిస్తుంది. ప్రపంచంలోని అన్ని ముఖ్యమతాల గుర్తులు, ఈ స్తంభానికి మూడు వైపులా చెక్కబడి ఉంటాయి. మీకు మతాతీతమైన స్వాగతం లభిస్తుంది. అక్కడికి వచ్చేవారందరికీ, గర్భగృహ ప్రవేశం ఇవ్వాలన్నదే సద్గురు ఆకాంక్ష. ఇలాంటి ప్రవేశం, దర్శనం మిగతా దేవాలయాలలో చాలా అరుదు.
ధ్యాన సన్నద్ధుల్ని చేసే ప్రయత్నం, అడుగడుగునా…
ఆలయానికి వచ్చే భక్తులూ, సాధకులూ మొదట తీర్థకుండంలో స్నానం చేస్తారు, తద్వారా వారి గ్రహణశీలత పెరిగి, ధ్యానలింగ శక్తుల్ని మరింతగా అందిపుచ్చుకోగలుగుతారు.
ఆలయ ప్రవేశం వద్ద అసాధారణమైన ఎత్తుతో ఉన్న ఆ గులకరాయి మెట్లు, ఎక్కేవారి పాదాలలోని కొన్ని నాడులను, నాడీ కేంద్రాలను జాగృతం చేస్తాయి. ఇది ధ్యానలింగ శక్తిని మనం గ్రహించడానికి సన్నద్దం చేసే మరొక పధ్ధతి.
ఆలయ ప్రవేశ మంటపంలో, ధ్యానలింగ ముఖ ద్వారానికి ఎడమవైపున వనశ్రీ (Vanashree), కుడివైపున యోగ విజ్ఞానానికి ఆధ్యులైన పతంజలి మహర్షి (Maharshi Patanjali) ల మూర్తులు దర్శనమిస్తాయి. ఇవి మానవ దేహంలోని ఈడా, పింగళ నాడులను సూచిస్తాయి. ఈ ఏర్పాటువెనుక ఉద్దేశ్యం ఏంటంటే, భక్తులూ, యోగ సాధకులూ వీటి మధ్య గుండా నిదానంగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు, వారి శక్తి వ్యవస్థలో మరింత సమతుల్యత ఏర్పడుతుంది. దీనితో గర్భగుడిలో ప్రవేశించిన తరువాత వారు సునాయాసంగా ధ్యాన స్థితిని పొందగలుగుతారు.
ఈ రకంగా, తీర్థకుండంలో స్నానం మొదలు,గర్భాలయ ప్రవేశం వరకూ, భక్తుల గ్రహణశీలతను మరింత పెంచేందుకు చేసిన ఆలోచన, కృషి అడుగడుగునా కనిపిస్తుంది. ధ్యానలింగాన్ని, అసాధారణ శక్తియుక్తులు కలిగిన ఒక యోగి పుంగవుడి అత్యద్భుత సృష్టికి తార్కాణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అసలు ధ్యానలింగం (Dhyanalingam) ఎందుకు?
సంస్కృతంలో, ధ్యాన అంటే ధ్యానం. లింగం అంటే ఆకారం. ఇక్కడ మౌనంగా కొన్ని నిమిషాలు కూర్చుంటే, ఆ ధ్యానలింగ సమక్షంలో ధ్యానం అంటే తెలియని వారికి కూడా, లోతైన ధ్యానానుభవం కలుగుతుంది.
మీరు కేవలం ధ్యానలింగం పరిధిలో కూర్చున్నంత మాత్రాన, ధ్యాన నిమగ్నులు అవుతారు. మీరు అక్కడ పది నిముషాలు కళ్లు మూసుకుని కూర్చుంటే చాలు, స్వతహాగానే ఎవరి సూచనల అవసరం లేకుండానే, మీరు ధ్యాన నిమగ్నులు అవుతారు. – సద్గురు.” – Sadhguru
ఏడు చక్రాల శక్తీ, తారా స్థాయిలో శక్తీకరింపబడిన ఈ ప్రదేశం, మనలోని వేరొక పార్శ్వాన్ని తాకి, మనలోని ఆధ్యాత్మికతకు బీజం వేస్తుంది.
ధ్యానలింగం ఒక గురువు పాత్రను పోషిస్తుంది (Role of a Guru)
ఒక ఆధ్యాత్మిక సాధకుడి జీవితంలో గురువు పాత్ర, దారి చూపించడం, బోధనలివ్వడానికే పరిమితం కాదు. ఒక సాధకుడు గురువుని ఆశ్రయించేందుకు ముఖ్య కారణం, ఆయన అతడిలో ఉన్న శక్తిని ప్రేరేపించి, ఒక కొత్త పార్శ్వాన్ని తాకేలా చెయ్యటమే.ఈ అంశంతో కూడిన గురువు పాత్ర, సాధకుడికి ధ్యానలింగం ద్వారా నిశ్చయంగా లభిస్తుంది. ఒక్కసారి, ఆ ధ్యానలింగ పరిథిలోకి వచ్చినవారెవరూ, వారిలో ముక్తి అనే ఆధ్యాత్మిక బీజం పడకుండా తప్పించుకోలేరు.
ధ్యానలింగం యొక్క శక్తుల ప్రాధమిక లక్ష్యం ఒక వ్యక్తి యొక్క ఆధాత్మిక ఉన్నతినీ, వికాసాన్నీ పెంపొందించడమే. కానీ ధ్యానలింగం, వారంలోని ప్రతి రోజూ ఒక్కో ప్రత్యేకమైన లక్షణాన్ని ప్రసరిస్తుంది. తద్వారా వివిధ ప్రయోజనాలను పొందవచ్చు.
ఈశా యోగా క్రంద్రంలోని వివిధ శక్తివంతమైన ప్రదేశాలు
తీర్థ కుండాలు
ధ్యానలింగ శక్తుల్ని అందిపుచ్చుకునే గ్రహణశీలతను పెంపొందించడానికి, ఆలయ ప్రాగణంలోని తీర్థకుండాలలో(శక్తీకరించిన నీటి కుండాలు) సందర్శకులు మునకలు వేస్తారు. ఈ నీటి కుండాలు, సద్గురుచే ప్రతిష్ఠింపబడిన రసలింగాలతో శక్తీకరింపబడ్డాయి. మహిళల కోసం చంద్రకుండం అనేది కొంత వరకూ స్త్రీత్వ శక్తితో ప్రతిష్ఠింపబడగా, పురుషుల కోసం సూర్యకుండం స్వభావరీత్యా చాలా వరకూ పుంస్త్వ శక్తిని కలిగి ఉంటుంది.
ఈ శక్తీకరించిన నీటి కుండాలలో స్నానం చేయడం వలన, అది మన ప్రాణ శక్తిలోని అసమతుల్యతలని సరిచేసి, భౌతిక, మానసిక శ్రేయస్సును మెరుగుపరచటమే కాకుండా, ఆధ్యాత్మిక శక్తిని కూడా మరింతగా గ్రహించేలా చేస్తుంది. ఈ జలాలకు ఉన్న స్వస్థపరిచే శక్తికి(Healing power), ప్రతీ సంవత్సరం వేలాదిగా వచ్చే సందర్శకులే ప్రమాణంగా నిలుస్తున్నారు.
చంద్రకుండం నేల మట్టానికి 30 అడుగుల దిగువన ఏర్పాటుచేయబడి ఉంటుంది, దీనిని చేరేందుకు దిగువకు 32 మెట్లు ఉంటాయి. చుట్టుపక్కల గోడలు పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళతో పొదగబడి, అర్థచంద్రాకారపు పై కప్పు గోడ, మహాకుంభ మేళా ఘట్టాన్ని వర్ణించే రంగురంగుల కుడ్య చిత్రంతో(wall mural Paint) ఉంటుంది.
సూర్యకుండం నేల మట్టానికి 30 అడుగుల దిగువన ఉంటుంది. ఇందులో మూడు రసలింగాలు ఉంటాయి. పైన రాగి ఇంకా ఇత్తడితో చేయబడిన అద్భుతమైన 20 అడుగుల సూర్యుని ప్రతిమ వేలాడదీయబడి ఉంటుంది.
ఆదియోగి ఆలయం
సాంప్రదాయ యోగాను దాని సంపూర్ణ వైభవంతో, స్వచ్ఛతతో పునరుద్ధరించేందుకు ఆదియోగి ఆలయం సద్గురుచే ప్రత్యేకంగా ప్రతిష్ఠీకరింపబడి, నిర్మింపబడింది. ఆలయ గర్భగృహంలో ఘనీభవించిన పాదరసంతో చేసిన ఆదియోగి లింగం ఉంటుంది. ఈ ప్రతిష్ఠించిన లింగం నుండి ప్రసరించే శక్తి, సాధకుడు యోగ విజ్ఞానాన్ని అంతర్ముఖ అనుభూతి చెందేందుకు ఆజ్యం పోస్తుంది.
82,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో స్తంభాల ఆధారం లేకుండా, నూతన ఒరవడితో కూడిన ప్రత్యేకమైన నిర్మాణశైలితో నిర్మితమైన ఆదియోగి ఆలయం, ఒకేసారి వేలాదిమందికి ఆశ్రయం కల్పించగలదు.
శక్తితో ప్రకంపించే ఆదియోగి ఆలయం, ప్రతీ సంవత్సరం ప్రపంచ నలుమూలల నుండి వచ్చే అభ్యర్థులు పాల్గొనే 21-వారాల ఇంటెన్సివ్ హఠ యోగా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహణకు అనువైన ప్రదేశం. అంతేకాకుండా, ఆ ఆలయం ప్రాథమిక స్థాయి కార్యక్రమాల నుండి సమ్యమతో సహా పై స్థాయి కార్యక్రమాలకు వేదికగా నిలుస్తుంది. సమ్యమ లో పాల్గొనే వారు 8- రోజులు పూర్తి మౌనంలో గడుపుతారు. ఇది వారు ఉన్నతమైన చైతన్య స్థాయిలకు చేరి, ప్రగాఢమైన ధ్యానానుభూతులను పొందేలా చేస్తుంది.
స్పంద హాల్
మీరు ఉన్నత ధ్యాన స్థాయిలను పొందేకొద్దీ, ‘స్పంద’ స్థితికి చేరువ అవుతారు– అంటే అక్షరాలా మిమ్మల్ని మీరు సృష్టించుకోక మునుపు ఉండే తీక్షణమైన, అవ్యక్తమైన శక్తి అది. – సద్గురు
విలక్షణంగా నిర్మించబడిన స్పంద హాల్ ధ్యానానికి నిర్దేశించబడిన ఒక ప్రదేశం. ఈశా యోగా సెంటర్లో జరిగే కార్యక్రమాలకి, వేడుకలకి ఇది ఒక వేదిక. స్పంద హాల్ 64,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది. ఈశా కు సంబంధించి వివిధ పైస్థాయి కార్యక్రమాలకు ఈ హాల్ ఆతిధ్యం ఇస్తుంది.
ఈ ప్రదేశంలోని ఆకట్టుకునే అంశం ఏంటంటే, ఆదియోగి అయిన శివుడి జీవితాన్ని వర్ణిస్తూ అత్యద్భుతంగా చిత్రించిన కుడ్య చిత్రము (Wall mural painting). ఇది 140X 12 అడుగుల వైశాల్యంతో ఉంటుంది. ఈ చిత్రరాజం ప్రపంచంలోనే అటువంటి శైలికి చెందిన చిత్రాలలో అతిపెద్దది. కేరళలోని ‘టెంపుల్ టౌన్ ఆఫ్ గురువాయుర్’ కు చెందిన రంగుల అద్దకపు కళా శైలిలో దీనిని చిత్రించారు. దీనికి కేవలం కాయగూరలు, మన్ను నుండి సంగ్రహించిన రంగులు మాత్రమే వాడుతారు.
‘స్పంద’ అంటే ప్రథమమైనది లేదా భీజభూతమైనది అని అర్థం. ఈ హాల్ స్వభావం ఎలాంటిదంటే, దీనిని ప్రధానంగా భావ స్పందన లాంటి కార్యక్రమాలకి ఉపయోగిస్తారు. అది అన్ని అనుభూతుల సమాహారం. దానిని ప్రతిష్ఠించిన విధానం ఎలాంటిదంటే, అక్కడ భావ స్పందన కార్యక్రమాలు చాలా సునాయాసంగా జరుగుతాయి. అది ధ్యానలింగం ఇంకా లింగభైరవి లతో ఒక నిర్దిష్టమైన సరేఖీయతతో (alignment) ఉండేలా నిర్మించబడింది. తద్వారా అవి ఒక నిర్దిష్టమైన ప్రభావంతో సమలేఖనంలో ఉంటాయి.
లింగ భైరవి
భైరవి కృపను ఎవరైతే పొందుతారో, వారు ఇక జీవన్మరణాలు, పేదరికం లేదా వైఫల్యాల గురించి చింతతో గానీ, భయంతో గానీ జీవించనవసరం లేదు. దేవి కృప పొందినట్లయితే, ఒక మనిషి ఏదైతే శ్రేయస్సు అని అనుకుంటాడో అందంతా అతని సొంతమవుతుంది – సద్గురు
లింగభైరవి, అతిశయమైన దివ్య స్త్రీ తత్త్వానికి వ్యక్తీకరణ. దేవి వెల్లెంగిరి పర్వత పాదాల వద్ద ఒక త్రిభుజాకారపు ఆలయంలో కొలువై ఉంది.
సంస్కారయుతమైనది- మొరటైనది, శక్తివంతమైనది – రమ్యమైనది, మృణ్మయమైనది, కారుణ్య మూర్తి ఇంకా తల్లిలాంటిది అయిన లింగభైరవి పరమోత్తమమైన ఒక సంపూర్ణ స్త్రీ. ఏక కాలంలో ప్రచండమైనదిగానూ ఇంకా దయగలదిగానూ ఉంటుంది. ఒక భక్తుడు తన జీవితంలోని భౌతిక – లౌకిక అంశాలలో విజయాన్ని కోరుతున్నా, ఆనందాన్ని కోరుతున్నా లేదా వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నా – దేవి వాటన్నింటినీ, ఇంకా అంతకంటే ఎక్కువే ప్రసాదిస్తుంది.
ఘనీభవించిన పాదరస దండం కేంద్ర భాగంగా లింగరూపంలో ఒక అమోఘమైన శక్తి స్వరూపంగా సద్గురు ప్రతిష్ఠించిన ఎనిమిది అడుగుల దేవి ఒక విశిష్టమైన మూర్తి. లింగభైరవి స్థాపన ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ద్వారా నిర్వహించబడింది. పైన చెప్పిన విధంగా, అది ప్రాణ శక్తులను ఉపయోగించి రాతిని దేవతామూర్తిగా రూపాంతరం చేసే ఒక అరుదైన మార్మిక ప్రక్రియ.
ధ్యానలింగం
కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా ధ్యానలింగ సన్నిధిలో కూర్చుంటేచాలు, ధ్యానమంటే తెలియనివారు కూడా గాఢమైన ధ్యానస్థితిని అనుభవిస్తారు. – సద్గురు
సంస్కృతంలో ‘ధ్యాన’ అంటే ధ్యానం ఇంకా ‘లింగ’ అంటే ఆకారం. ధ్యానలింగం ఒక అత్యద్భుతమైన ధ్యాన ప్రదేశం. అది ఏ మత విశ్వాసానికో ఆపాదించబడదు. దానికి ఏ క్రతువులు, ప్రార్థనలూ లేదా ఆరధనలూ అవసరం లేదు. అది ఒక నిరుపమానమైన శక్తి స్వరూపం, ధ్యానలింగం జ్ఞానోదయానికి, ముక్తికీ ద్వారం వంటిది. ఆధ్యాత్మికంగా చూస్తే, ధ్యానలింగం ఒక గురువు వంటిది. ఆధ్యాత్మిక సాధకులకు , ప్రత్యక్ష గురువు సాన్నిధ్యములో, ఆధ్యాత్మిక సాధనాలు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ అవకాశం సాంప్రదాయకంగా కేవలం కొద్దిమంది మాత్రమే అందుబాటులో ఉంటూ వచ్చింది.
ఈ ధ్యానలింగాన్ని ప్రాణప్రతిష్ఠాపన చెయ్యడం వెనకాల ఉన్న ఆలోచన అంతరార్థం ఏమిటంటే, మేము ఇలా ధ్యానం బోధిస్తూ వెళితే, మీరు ఎంత మందికి భోధించగలరు? దానికి ఒక పరిమితి ఉంటుంది. కాని ధ్యానలింగం కోట్లమందికి ఒక మాటైనా మాట్లాడకుండానే యోగాన్ని భోధించగలదు. ఇక్కడ కూర్చున్న అందరూ ధ్యానంలోకి వెళతారు. అదే దాని విశిష్టత. – సద్గురు
యోగ సంస్కృతిలో ఎల్లపుడూ దీని ప్రస్తావన ఉన్నప్పటికీ, గ్రంథాలలో ధ్యానలింగం గురించి ఏ విధమైన సమాచారం లేదు. అది ఆత్మజ్ఞానులైన వారు కన్న కలగా ఉంటూవచ్చింది. కానీ దానిని సృష్టించడంలో ఉన్న సంక్లిష్టతలు ఎలాంటివంటే, అవి చాలా అరుదుగా సమకూరతాయి. ఇటువంటి ఒక లింగాన్ని ప్రతిష్ఠించడానికి, జరిపిన కృషి వెయ్యి సంవత్సరాల కిందట భారతదేశంలోని భోపాల్ లో జరిగింది. ఆ ప్రక్రియ ఎంతో వైభవమైనదే గానీ, చివరి దశలో విఫలమైంది.
ఈరోజు, దాని అసాధారణమైన ఉనికి, ప్రపంచాన్ని పావనం చేయడం మన అదృష్టం. మూడు సంవత్సరాల తీవ్రమైన సాధన తరువాత, ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ ద్వారా 1999 జూన్ 24న సద్గురు ధ్యానలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇది శక్తి కాలానుగుణంగా తరిగిపోకుండా ఉండేలా ఏడు చక్రాల శక్తినీ తారా స్థాయికి చేర్చి బంధించిన ఒక శుద్ధమైన శక్తి ప్రక్రియ. 1999, నవంబర్ 23న, ధ్యానలింగం ప్రపంచానికి సమర్పించబడింది.
ఆదియోగి – యోగాకు మూలం
ఇక్కడ ఉన్న ఆదియోగి మిమ్మల్ని అనారోగ్యం నుండి, కష్టాలు ఇంకా పేదరికం నుండి, అన్నిటికీ మించి జీవన్మరణాల నుండి విముక్తుల్ని చేస్తాడు – సద్గురు
15000 సంవత్సరాల క్రితం, అన్ని మతాలకంటే ముందు, ఆదియోగి (మొదటి యోగి), యోగ శాస్త్రాన్ని, సప్త ఋషులు అయిన తన ఏడుగురు శిష్యులకు అందించాడు. మానవులు తమ పరిమితుల్ని అధిగమించి, పరమోత్తమ సంభావ్యతను చేరేందుకు 112 పద్ధతులను వివరించాడు. ఆదియోగి అందించిన పద్ధతులు, వ్యక్తి పరివర్తనకు సాధనాలు. ప్రపంచాన్ని పరివర్తన చేయాలంటే దానికి వ్యక్తిగత పరివర్తన ఒక్కటే మార్గం. మానవ శ్రేయస్సు ఇంకా విముక్తి కోసం “బయటపడేందుకు గల ఏకైక మార్గం అంతరంగమే” అనేది ఆయన ప్రధాన సందేశం.
మహాశివరాత్రి పర్వదినాన ఈశా యోగా కేంద్రంలో “ఆదియోగి – యోగాకు మూలం” యొక్క అత్యద్భుతమైన ముఖాకృతిని, గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆదియోగిని, ప్రపంచంలోనే “అతిపెద్ద ముఖాకృతి నిర్మాణం” గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. 112 అడుగుల ఎత్తు ఉన్న ఆదియోగి ముఖాకృతి, మానవుడు శ్రేయస్సుని ఇంకా తన పరమోత్తమ స్వభావాన్ని పొందేందుకు ఆయన అందించిన 112 పద్ధతులను సూచిస్తుంది.
ఆదియోగి వద్ద యోగేశ్వర లింగం స్థాపించబడింది. ఇది మానవ దేహంలోని ఐదు ప్రధాన చక్రాలకు అభివ్యక్తీకరణగా సద్గురుచే ప్రతిష్ఠించబడింది. యోగేశ్వర లింగ సాన్నిధ్యంతో ఆదియోగి ఒక సజీవ ప్రమాణంగా నిలిచాడు.
You must log in to post a comment.