ములాయం సింగ్ యాదవ్

ములాయం సింగ్ యాదవ్(1939)

ములాయం సింగ్ యాదవ్ సఫాయి గ్రామంలో పేద రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే ఆటలు మీద ఆసక్తి చూపారు, ముఖ్యంగా శరీరాన్ని దృడంగా ఉంచే వ్యాయామాలు చేసేవారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ప్రతి కుస్తీ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచేవారు. రాజనీతి శాస్త్రంలో డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ లలో, వ్యాయామ విద్యలో డిప్లొమా పూర్తి చేసి కొంతకాలం స్వగ్రామంలో వ్యాయామ ఉపాధ్యాయులుగా, కుస్తీ పోటీల శిక్షకులుగా , రైతుగా పనిచేశారు.

సోషలిస్టు దిగ్గజం రామ్ మనోహర్ లోహియా ప్రబోధించిన సిద్ధాంతాలకు ఆకర్షితుడై లోహియా అనుచరుడిగా రాజకీయాల్లో ప్రవేశించి 1967 నుంచి 2007 వరకు 8 సార్లు రాష్ట్ర అసెంబ్లీకి, 1996 నుంచి ప్రస్తుతం వరుకు 6 సార్లు లోక్ సభకు,1980 నుంచి 1985 వరకు రాష్ట్ర మండలి సభ్యులు గా ఎన్నికయ్యారు.

1977లో మొట్టమొదటి సారి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.అనంతరం 1982 నుంచి 1985 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నేత గా కొనసాగారు. ముఖ్యమంత్రి గా1989 నుంచి 1991 వరకు మొదటి సారి, 1993 నుంచి 1995 వరకు రెండో సారి, 2003 నుంచి 2007 వరకు మూడు సార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసారు. 1996 నుంచి 1998 వరకు కేంద్ర యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో దేశ రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ములాయం కుటుంబం మొత్తం రాష్ట్ర మరియు దేశ రాజకీయాల్లో ఉంది, కుమారుడు అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత లోక సభలో సభ్యుడు, కోడలు డింపుల్ యాదవ్ మాజీ యంపీ, సోదరుడు శివ పాల్ యాదవ్ ప్రస్తుత యూపీ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యే, ఇంకా చాలా మంది యూపీ లోని ప్రతి జిల్లాలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అనేక పదవుల్లో కొనసాగుతున్నారు.

మాజీ బీహార్ ముఖ్యమంత్రి , ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె ను తన మనుమడు కిచ్చి వివాహం జరపడం వల్ల బీహార్ రాష్ట్రంలోని యాదవ సామాజిక వర్గానికి మరో ముఖ్య నేతగా పలుకుబడి కలిగి ఉన్నారు.

మొదట లోహియా అనుచరుడిగా ఉన్న ములాయం ఆయన ఆకస్మిక మరణం వల్ల మరో సోషలిస్టు నేత రాజ్ నారాయణ్ , మాజీ ప్రధాన మంత్రులు చరణ్ సింగ్, వి.పి.సింగ్, చంద్రశేఖర్ గార్ల ప్రధాన అనుచరుడిగా కొనసాగారు. ములాయం యాదవ్ గారికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు మైనార్టీ, యాదవ్ సామాజికవర్గం లో గట్టి పట్టుంది. “నేతాజీ”గా కూడా యూపీ రాష్ట్ర ప్రజానీకానికి అత్యంత సుపరిచితులు.

దేశ, యూపీ రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన ములాయం మరోసారి దేశ , 2021లో జరిగే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యపాత్ర పోషించడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నారు.

%d bloggers like this: