లోహ పురుషుడు గా దేశవ్యాప్తంగా పేరుపొందిన అద్వానీ గారి పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. అవిభజిత భారత దేశంలో ఉన్న సింధూ రాష్ట్రంలోని కరాచీ పట్టణంలో జన్మించారు(ప్రస్తుతం పాకిస్థాన్ దేశం). అద్వానీ తండ్రి కిషన్ చంద్ గారు అప్పటి సింధూ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలో ఒకరు. దేశ స్వాతంత్ర్య సమయంలో భారత దేశానికి వలస వచ్చిన సింధీ కుటుంబాల్లో వీరి కుటుంబం ఒకటి.
14 ఏళ్ల వయస్సు లో మిత్రుడి ప్రోద్బలంతో ఆర్ ఎస్ ఎస్ లో చేరి ప్రచారక్ గా ఎదిగారు. 1952లో జనసంఘ్ పార్టీలో చేరి 1960 నాటికి పార్టీ లో ఉన్న ముఖ్య నాయకుల్లో ఒకరిగా ఎదిగారు.1966 నుంచి 1967 వరకు ఢిల్లీ నగర పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.1966 నుంచి 1977 వరకు జనసంఘ్ పార్టీ జాతీయ కార్యవర్గంలో సభ్యులుగా పనిచేశారు. 1967లో జరిగిన ఢిల్లీ నగర పురపాలిక ఎన్నికల్లో పార్టీ తరుపున అధ్యక్షుడు గా ఎన్నికయ్యి 1970 వరకు పనిచేశారు. ఇదే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటి విజయం.
1970 నుంచి 1980 వరకు దేశ రాజకీయల్లో ఆయన పాత్ర అతి స్వల్పంగా ఉండేది. 1980లలో బీజేపీ పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుల్లో ఒకరు. 1985లో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యి పార్టీని దేశవ్యాప్తంగా విస్తృతంగా విస్తరించడమే లక్ష్యం గా పనిచేశారు. 1987లో రామాజన్మభూమి ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి పార్టీ తరుపున ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లడంలో అద్వానీ గారి పాత్ర ముఖ్యమైనది. దేశంలో రథ యాత్రలకు ఆద్యుడు అద్వానీ గారు, ఆయన రథయాత్ర చేసిన ప్రతి సారి బీజేపీ పార్టీ బలపడడానికి దోహదం చేసాయి. బీజేపీ అధ్యక్షుడుగా పార్టీకి బలమైన కార్యకర్తల సైన్యం తయారు చేసిన ఘనత కూడా అద్వానీ గారి సొంతం.
కాంగ్రెస్ , మిగిలిన పార్టీలు ముస్లింల ఓట్లు, రిజర్వేషన్లు రాజకీయాల్లో బిజీగా ఉంటే వారికి విరుగుడుగా బీజేపీ పార్టీని సనాతన హిందూ ధర్మం పరిరక్షణకు సంబంధించిన రాజకీయాల్లోకి ప్రవేశపెట్టారు. 1980 మధ్య నుంచి 2004 చివరి వరకు దేశ రాజకీయాల్లో ముఖ్యంగా హిందూ సమాజంలో అద్వానీ గారు ఒక శక్తివంతమైన వ్యక్తి, హిందూ మతం పరిరక్షణకు కట్టుబడిన యోధుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం అలాంటి హోదా ప్రస్తుత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారికి సొంతం.
1970,1976,1982,1988 లలో వరుసగా జనసంఘ్, బీజేపీ పార్టీల తరుపున 4 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.1989,1991,1996,1998,1999,2004 , 2009, 2014 లలో వరుసగా 8 సార్లు వివిధ స్థానాల నుంచి లోక్ సభ కు ఎన్నికయ్యారు. 1977లో జనతా ప్రభుత్వంలో సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా, 1998 నుంచి 2004 వరకు కేంద్ర హోంశాఖ మంత్రిగా, 2002లో బొగ్గు గనుల శాఖకు ఇంఛార్జి మంత్రిగా,1980లో మొదటి ఆరు నెలలు రాజ్యసభ ప్రతిపక్ష నేతగా, 2002 నుంచి 2004 వరకు దేశానికి ఉప ప్రధానమంత్రి గా పనిచేశారు.
అద్వానీ గారికి అత్యంత సన్నిహితులు, ప్రాణ మిత్రులు వాజపేయి గారు. వారి స్నేహం జనసంఘ్ పార్టీతో మొదలై సుమారు 60 దశాబ్దాలు కొనసాగింది(వాజపేయి మరణించే వరకు). అద్వానీ గారు కరుడుగట్టిన హిందూత్వ వాది, అలా అని ఆయన ఇతర మతాల ప్రజలను ఏనాడు వ్యక్తిగతంగా కానీ ఎన్నికల సభల్లో కానీ తూలనాడలేదు. 2 సీట్లు ఉన్న బీజేపీ పార్టీ ఈరోజు దేశంలో అతి శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దుడంలో ఆయన పాత్ర అనన్య సామాన్యమైనది.
ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారికి రాజకీయ గురువు మరియు ఆయన రాజకీయ భవిష్యత్తును కాపాడం కోసం ఎన్నో ఒత్తిడలను ఎదుర్కొన్నారు. భారతదేశంలో ఏంతో మంది గొప్ప రాజకీయ నాయకులు జన్మించారు, అలాంటి వారిలో అద్వానీ గారి పేరు ముందువరుసలో ఉంటుంది. దేశంలో రాజకీయాలు, హిందూ సమాజం ఉన్నంతవరకు ఆయన చెరిగిపోని అధ్యాయం. ఒక వేళ ఆయన వాజపేయి గారి బదులు దేశానికి ప్రధానమంత్రి అయ్యుంటే ప్రస్తుత దేశ రాజకీయ చరిత్ర మరో విధంగా ఉండేది.
You must log in to post a comment.