అమిత్ షా

అమిత్ షా గారి పూర్తి పేరు అమిత్ భాయ్ అనిల్ చంద్ర షా. షా మూతత్తా, తాత గార్లు గుజరాత్ లోని మన్స రాజ్యంలో మన్స నగరానికి పరిపాలన అధికారులు, వారి తండ్రి గారు అవిభజిత బొంబాయి రాష్ట్రంలో గుజరాత్ ప్రాంత ప్రముఖ వ్యాపార వేత్త. వీరి కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులు, సోషలిస్టు నేత మిను మసాని, గుజరాత్ రాష్ట్ర పీత ఇందులాల్ యాగ్నిక్ , సర్దార్ పటేల్ గారి కుమార్తె మణిబెన్ గారు వీరి కుటుంబానికి అత్యంత సన్నిహితులు.1977 లోక్ సభ ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థులకు ఆర్థికంగా సహాయం చేశారు.

చిన్న వయస్సు లోనే ఆర్ ఎస్ ఎస్ లో బాల స్వయం సేవక్ గా పనిచేసిన షా , అహ్మదాబాద్ లో చదువుకుంటున్న సమయంలో పూర్తిగా శాఖ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్థిగా ఉన్న సమయంలోనే ప్రస్తుత ప్రధాన మంత్రి, అప్పటి ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా ఉన్న మోడీ గారిని కలుసుకున్నారు అప్పట్నుంచి ఇప్పటి దాకా వారి బంధం ఆరోగ్యకరంగా ఉంది. డిగ్రీ పూర్తి చేసిన తరువాత కొంతకాలం తండ్రి వ్యాపారంలో సహాయకారిగా, స్టాక్ మార్కెట్ లో ఏజెంట్ గా పనిచేశారు.

షా తొలుత ఆర్ ఎస్ ఎస్ విద్యార్థుల విభాగం ఏబీవీపీ లో అనేక పాత్రలు పోషించారు, ఎబివిపి లో ఉన్న సమయంలో ప్రముఖ దిగ్గజ నాయకుడు నానజీ దేశముఖ్ గారి తో కలిసి పనిచేశారు. 1988లో బీజేపీ పార్టీ లో చేరి పార్టీ యువ విభాగం యువ మోర్చా లో అనేక పదవులు జాతీయ స్థాయిలో చేపట్టారు,ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డా, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గార్లు కూడా బిజెవైఎం లో షాతో కలిసి పనిచేశారు. 1991లో గాంధీనగర్ లోక్ సభ స్థానం నుంచి అద్వానీ గారు భారీ విజయం సాధించడంలో షా పాత్ర కీలకం.

మోడీ షా లు కలిసి గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పార్టీని పటిష్టపరిచేందుకు కలిసి పనిచేశారు, అప్పట్నుంచి ఇప్పటి దాకా వారు నిర్మించిన పార్టీ వ్యవస్థ రాష్ట్రంలో బలంగా ఉంది. మోడీ జాతీయ పార్టీ కార్యదర్శిగా ఉన్న సమయంలో గుజరాత్ రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులు గురించి తెలియజేసే వ్యక్తి గా షా ముఖ్య పాత్ర పోషించారు. 1997 నుంచి 2014 వరకు నాలుగు సార్లు గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు, 2002 నుంచి 2010 వరకు అనేక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఒక దశలో 12 శాఖలకు మంత్రిగా పనిచేశారు.

1995 నుంచి 1996 వరకు గుజరాత్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు,1999లో అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు ఎన్నికల్లో గెలిచి బ్యాంకు అధ్యక్షుడిగా నష్టాల్లో ఉన్న బ్యాంక్ ను లాభాల బాటలో నడిపించారు. 2009 నుంచి 2017 వరకు గుజరాత్ క్రికెట్ సంఘానికి ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం సర్దార్ పటేల్ స్టేడియం నిర్మాణం షా పర్యవేక్షణలో జరిగింది.

మోడీ వరుసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడంలో షా ముఖ్య పాత్ర పోషించారు. 2014,2019లలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ వరుసగా కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ తో రెండు సార్లు అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం షా, అందుకే ఆధునిక దేశ రాజకీయాల్లో అపర చాణక్యుడు గా పేరు గాంచారు .

2014 నుంచి ప్రస్తుతం వరకు బీజేపీ పార్టీని దేశంలో బలమైన పార్టీగా మలచడంలో షా గారి పాత్ర కీలకం. బీజేపీ ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు , ద్వారకా నుంచి ఈశాన్య రాష్ట్రాల కు విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. 2019లో దేశానికి హోమ్ మంత్రిగా దేశంలో ఉన్న వివాదాస్పద సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. మోడీ గారు అధికారాన్ని నిర్వహిస్తుంటే , షా గారు పార్టీని నిర్మించడానికి, ఎన్నికల్లో పార్టీ ని విజయ తీరాలకు చేర్చేందుకు కృషి చేస్తున్నారు.

అమిత్ షా గారు కరుడుగట్టిన హిందుత్వ వాది, ఆయన దేశంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసమే రాజకీయాల్లోకి ప్రవేశించారు . ప్రస్తుతం దేశంలో ప్రధానమంత్రి మోడీ తరువాత రెండో శక్తివంతమైన వ్యక్తి అమిత్ షా గారు. భవిష్యత్తులో దేశానికి ప్రధానమంత్రి కూడా అవుతారని దేశ రాజకీయాల్లో వినికిడి.

%d bloggers like this: