కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి(1960)

కిషన్ రెడ్డి గారు 15 జూన్ 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న తిమ్మాపూర్ గ్రామంలో తిమ్మ రెడ్డి, ఆండాళ్ మ్మ దంపతులకు జన్మించారు. వారిది సాధారణ రైతు కుటుంభం. హైదరాబాద్ లోని సెంట్రల్ టూల్ డిజైన్ ఇనిస్టిట్యూట్ నుంచి టూల్ డిజైనింగ్ లో డిప్లొమా అందుకున్నారు.

విద్యార్థిగా ఉన్న సమయంలో ఎన్నో రాజకీయ సమస్యలకు పరిష్కారం కోసం యువ చర్చ కార్యక్రమాలు నిర్వహించి తన నాయకత్వ లక్షణాలను వెలికి తీశారు. 1977లో లోక మాన్య జై ప్రకాశ్ నారాయణ్ గారి స్పూర్తితో వారు స్థాపించిన జనతాపార్టీ లో చేరి సికింద్రాబాద్ నుంచి లోక్ సభకు పోటీ చేసిన బండారు దత్తాత్రేయ తరుపున ప్రచారం చేశారు.1980లో బీజేపీ స్థాపించిన తరువాత పార్టీలో చేరిన మొదటి యువకుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉన్న వారిలో కిషన్ గారు ఒకరు.

1980లో తన సొంత జిల్లా రంగారెడ్డి జిల్లాకు బీజేపీ పార్టీ కన్వీనర్ గా ,1983లో బిజెవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, 1984లో ప్రధాన కార్యదర్శిగా, 1985 నుంచి 1992లో రాష్ట్ర అధ్యక్షుడిగా, 1992లో బిజెవైఎం జాతీయ కార్యదర్శిగా, 1992 చివరి నుంచి 1994 వరకు జాతీయ ఉపాధ్యక్షుడిగా, 1994లో ప్రధాన కార్యదర్శిగా 2001 వరకు, 2001లో బీజేపీ పార్టీ రాష్ట్ర కోశాధికారిగా 2002 వరకు , 2002లో జాతీయ బిజెవైఎం అధ్యక్షుడిగా, 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా, 2014 నుండి 2016 వరకు తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసారు.

2004లో హిమయత్ నగర్ నుంచి రాష్ట్ర శాసనసభకు మొదటిసారిగా ఎన్నికయ్యారు, 2009లో నియోజకవర్గ పూనర్విభిజన కారణంగా హిమయత్ నగర్ రద్దు చేసి అంబర్ పేట్ నియోజకవర్గం ఏర్పడింది ఆ స్థానం నుంచి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు, 2014 లో మూడోసారి అంబర్ పేట్ నుంచి మూడోసారి ఎన్నికయ్యారు, 2018లో ఓటమిని చవిచూసిన తర్వాత 2019లో జరిగిన లోక్ సభ కు జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి మొదటిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు, అలాగే కేంద్ర మంత్రివర్గంలో హోమ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రస్తుతం వరకు కొనసాగుతున్నారు.

ప్రేత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరు తెలంగాణ పేరుతో 2012లో మహబూబ్ నగర్ జిల్లా నుంచి తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా 25 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించారు. కిషన్ రెడ్డి గారు రాజకీయంగా ఎన్నో పదవులు నిర్వహించారు, మోర్చా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేషనల్ యూత్ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు, అలాగే 2003లో జరిగిన అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక యూత్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో విజయవంతంగా నిర్వహించారు, అప్పటి కార్యక్రమంలో 195 దేశాలకు చెందిన యువత పాల్గొన్నారు.

1994లో అమెరికాలో జరిగిన అమెరికా కౌన్సిల్ ఆఫ్ యంగ్ లీడర్లు స్టడీ ప్రోగ్రాంలో దేశం మొత్తం నుంచి ఎంపికైన యువ నేతల్లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తో పాటు ఎంపికయ్యారు, మోడీ గారితో ఆనాడు ఏర్పడిన అనుబంధం ఈరోజు వరకు అలాగే కొనసాగుతుంది. ఉగ్రవాదం అనే అంశం మీద పట్టున్న అతి కొద్ది మంది భారతీయ రాజకీయ నాయకుల్లో కిషన్ రెడ్డి గారు ఒకరు, వారికి హోమ్ శాఖ సహాయ మంత్రి పదవి రావడానికి ఇది ఒక కారణం.

%d bloggers like this:
Available for Amazon Prime