వసుంధర రాజే సింధియా(1953)
వసుంధర రాజే సింధియా ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియార్ సంస్థాన చివరి పాలకుడు , మహారాజ జీవాజి రావు సింధియా, రాజమాత విజయరాజే దంపతులకు జన్మించారు. దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక విద్య సంస్థల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి , రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద సంస్థానాల్లో ఒకటైన ధోల్పూర్ రాజకుటుంబానికి కోడలు అయ్యారు.
1984లో బీజేపీ పార్టీలో చేరి పార్టీలో అనేక కీలకమైన పదవులు అధిరోహించారు ప్రస్తుతం బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. 1985 నుంచి ప్రస్తుతం వరకు 5 సార్లు రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీకి, 1989 నుంచి 2003 వరకు 5 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 1998 నుంచి 2003 వరకు విదేశాంగ సహాయ మంత్రిగా, కుటీర పరిశ్రమలు, ప్రజా వ్యవహారాలు మరియు పరిపాలన వ్యవస్థ, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్న శాఖలకు పర్యవేక్షణ మంత్రిగా స్వాతంత్ర మరియు కేబినెట్ మంత్రిగా పనిచేశారు.
2003 నుంచి 2007 వరకు మొదటి సారి, 2013 నుంచి 2018 వరకు రెండో సారి రాజస్థాన్ ముఖ్యమంత్రి గా, 2007 నుంచి 2013,2018 నుంచి ప్రస్తుతం వరకు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి గా రాజే అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టి అందరిచేత ప్రశంసలు అందుకున్నారు.
సింధియా కుటుంబం తొలి నుంచి దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించిన కుటుంబం, విజయరాజే సింధియా గారు, ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికయ్యారు, బీజేపీ పార్టీ వ్యవస్థాపకులు, సోదరుడు మాధవ రావు మాజీ కేంద్ర మంత్రి , సోదరి యశోధర రాజే మాజీ ఎంపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ముఖ్య నాయకురాలు, మేనల్లుడు జ్యోతిరాదిత్య సింధియా మాజీ కేంద్ర మంత్రి , ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ, కుమారుడు యువరాజు రాణా దుష్యంత్ సింగ్ 2004 నుంచి ప్రస్తుతం వరకు వరుసగా 4 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు.
రాజకీయాల్లో మిగిలిన రాజకీయ నాయకులతో పోలిస్తే వసుంధర రాజే శైలి చాలా భిన్నంగా ఉంటుంది, ప్రస్తుత రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ ఆమెకు మంచి స్నేహితుడు , శ్రేయోభిలాషి అవడం కోసమెరుపు.
You must log in to post a comment.