
ఈ కోర్సు లో చేరాలి అని అనుకునే వారు ప్రవేశ పరీక్షను రాయాలి బి బి ఏ కోర్స్ ఇన్ చేయాలనుకుంటే ప్రవేశ పరీక్ష గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో 70 శాతం రాత పరీక్ష గ్రూప్ డిస్కషన్ కు 15 శాతం మరియు ఇంటర్వ్యూ కూడా 15 శాతం వెయిటేజీ ఉంటుంది ఒకవేళ కోర్సుకు అటువంటి పరీక్షలలో స్కోర్లు ఉంటే వారికి రాత పరీక్ష మినహాయింపు గా ప్రకటించారు
బి బి ఏ , ఎంబీఏ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్ సహకారం కూడా ఈ సంస్థ అందిస్తుంది క్యాంపస్ ప్లేస్మెంట్ సౌకర్యం ఇక్కడ ఉంది అభ్యర్థులకు థామస్ కుక్ మెక్మైట్రిప్ హాలిడే ఇన్, ఐఆర్సీటీసీ హ్యాపీ టూర్ యాత్ర డాట్ కామ్ వంటి ట్రావెల్ మరియు టూరిజం కంపెనీల్లో అవకాశాలు లభిస్తాయి
ఈ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 30 జూన్ మరియు ప్రవేశ పరీక్ష 19 జూలై గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూలు 20- 31 జూలై మరిన్ని మరింత సమాచారం కొరకు iittmsouth.org లో పొందవచ్చు
మొత్తం బి బి ఏ కోర్సు మూడు సంవత్సరాలు ఈ మూడేళ్లకు కలిపి ఫీజు 2,79,350 రూపాయలు అదే ఎంబీఏ కోర్సు అయితే ఫీజు రెండేళ్లకు 3,39,850 రూపాయలు. ఎక్కడా ప్రవేశం పొందిన వారికి అనేక రకాల స్కాలర్షిప్లు అందుకునే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ద్వారా స్కాలర్షిప్లను పొందవచ్చు మరియు ఏపీ ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్లకు మెరిట్ స్కాలర్ షిప్ ను పొందవచ్చు దానికి కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ స్కాలర్ షిప్ ఐఐటీఎమ్ కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా మంజూరు చేయడం జరుగుతుంది
బి బి ఏ టూరిజం అండ్ ట్రావెల్ కోర్సు ప్రవేశం రాయాలి అనుకుంటే ఇంటర్మీడియట్ లో కనీసం 50 శాతం మార్కుల తో ఉత్తీర్ణులై ఉండాలి. ఒక వేళ రిజర్వ్డ్ కేటగిరి అయితే 40 శాతం మార్కులు ఉంటే సరి పోతుంది కాకపోతే ఈ కోర్సు లో చేరాలనుకుంటే నెల్లూరు లో మొత్తం 75 సీట్లు మాత్రమే ఉన్నాయి జనరల్ కేటగిరి ఓబిసి కేటగిరీ అభ్యర్థులు వయస్సు 22 మించకూడదు అదే రిజర్వ్డ్ కేటగిరీ అయితే ఐదేళ్లు మినహాయింపు ఉంది.
ఎంబీఏ కోర్సు రెండేళ్లు ఎంబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ చేయాల్సి చేయాలనుకునే వాళ్లకు 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉన్న వారే అర్హులు ఈ ఏడాది చివరి పరీక్షలు రాసిన వారు మరియు రాయబోతున్న వారు కూడా అర్హులే కాకపోతే వయసు 27 ఏళ్లు మించకూడదు రిజర్వ్డ్ కేటగిరీ అయితే ఐదేళ్ళ సడలింపు ఉంటుంది నెల్లూరు నియర్ భువనేశ్వర్ నోయిడా క్యాంపస్ లో అన్నీ కలిపి 750 సీట్లు మాత్రమే ఉన్నాయి.
అభ్యర్థులు తమ కెరీర్ను టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ రంగం వైపు మక్కువ ఉంటే కొత్తగా ఏర్పడిన ఈ సంస్థకు సంస్థలో చేరడం మంచిదే. ఇదే సంస్థ పీజీ కోర్సులను కూడా అందిస్తోంది కనుక ఇక్కడ చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉంది మరియు క్యాంపస్ క్యాంపస్ ప్లేస్మెంట్లు సౌకర్యం ఉంది కనుక ఏ సమస్య ఉండదు.
You must log in to post a comment.