దేశ అత్యున్నత సర్వీసుల్లో చేరడం లక్షల మంది ప్రతిభావంతుల కల. అందుకోసం ఏళ్లతరబడి అహోరాత్రులు పుస్తకాలతో కుస్తీపడుతుంటారు.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
![]() పేపర్ 1 కీలకం: పరీక్ష స్వరూపం :
సిలబస్లో ఏడు అంశాలు : పేపర్ 1లో ఏడు ప్రధాన అంశాలను పేర్కొన్నారు. అవి..1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యాంశాలు 2. భారతదేశ చరిత్ర, భారత స్వాతంత్రోద్యమం 3. భారత, ప్రపంచ భౌగోళికశాస్త్రం: భౌతిక, సామాజిక, ఆర్థిక భౌగోళిక అంశాలు, 4. భారత రాజకీయ వ్యవస్థ, పరిపాలన-రాజ్యాంగం, పంచాయతీరాజ్, పౌర విధానం, హక్కులు-సమస్యలు, 5. ఆర్థిక, సామాజిక, సుస్థిర-అభివృద్ధి, పేదరికం, ద్రవ్యోల్బణం, డెమోగ్రాఫిక్స్, సామాజిక రంగ కార్యక్రమాలు, 6. పర్యావరణం, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు- సాధారణ అంశాలు, 7. జనరల్ సైన్సు. పేపర్ 2 :
ప్రశ్నల వైవిధ్యత :
జనరల్ స్టడీస్ :సివిల్స్లో జనరల్ స్టడీస్ కీలకం. ఇందులో కరెంట్ అఫైర్స్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. జీఎస్ను స్టాటిక్, డైనమిక్ భాగాలుగా విభజించుకోవాలి. 1857 తిరుగుబాటు, భారత భౌగోళిక స్వరూపం తదితరాలు స్టాటిక్ కిందకొస్తాయి. న్యూస్ పేపర్లు, యోజన మ్యాగజీన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ), ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ తదితరాలను అనుసరించడం ద్వారా డైనమిక్ పార్ట్పై అడిగే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలుగుతారు.
చరిత్ర-స్వాతంత్య్రోద్యమం : చరిత్రలో కీలక అంశాలు:
సంస్కృతి-కళలు :
ప్రిలిమ్స్లో సంస్కృతి-కళలపై ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. వీటి ప్రిపరేషన్కు భిన్న మార్గాలను అనుసరించొచ్చు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవడం లాభిస్తుంది. సంస్కృతికి సంబంధించి దేవాలయ శిల్పసంపద, చిత్రాలు, స్మారక స్థూపాలు, యునెస్కో గుర్తించిన ప్రదేశాల గురించి చదవాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో పూర్తి పేజీలో ముంద్రించిన చిత్రపటాలపై ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఆయా చిత్రపటాల సమాచారాన్ని అధ్యయనం చేయాలి. దీంతోపాటు గుప్తులు, మౌర్యులు, దక్షిణ భారతదేశంలోని సంగమ వంశం కాలం నాటి శిల్పకళపై ప్రశ్నలు వస్తున్నాయి. ఈ దిశగా సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్(సీసీఆర్టీ) వెబ్సైట్లో లభించే సమాచారం అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. పరిపాలన : దీంతోపాటు..
సైన్స్, టెక్నాలజీ : ఎన్సీఈఆర్టీ పుస్తకాలు, 6-10 తరగతుల పుస్తకాలు, కరెంట్ అఫైర్స్ మ్యాగజీన్ల అధ్యయనంతో సైన్స్ అండ్ టెక్నాలజీలో మంచి మార్కుల పొందవచ్చు. సిలబస్లో 9 కీలక విభాగాలను పేర్కొన్నారు. వీటిలో బయోటెక్నాలజీ టాపిక్ అత్యంత కీలకమైంది. ఈ విభాగం నుంచి ఏటా ప్రశ్నలు వస్తున్నాయి. దీంతోపాటు ఐఓటీ, 3డీ ప్రింటింగ్, హెల్త్కేర్, ఐఆర్ఎస్, రామ్సన్వేర్, ఏపీఐ యాప్స్, సైబర్ సెక్యూరిటీ, స్పేస్ శాటిలైట్స్, నావిగేషన్ సిస్టమ్ తదితరాలు ముఖ్యమైనవి. ఆర్థికం : పథకాలు : కరెంట్ అఫైర్స్ :గత 10-12 నెలల వ్యవధిలోని జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యాంశాల గురించి అధ్యయనం చేయాలి. సివిల్స్ అభ్యర్థులు పత్రికలను పరీక్ష కోణంలోనే చదవాలి. అలాకాకుండా పేపర్ మొత్తం చదవడం వల్ల ఉపయోగం లేకపోగా సమయం వృథా అవుతుంది. వార్తా పత్రికల్లో ప్రశ్నలు అడిగేందుకు ఆస్కారం ఉన్న అంశాలనే చదివి నోట్ చేసుకోవాలి. పరీక్షలో కీలక విభాగాలైన సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్స్లో అడిగే ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ ఆధారితంగా ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్ పరంగా వార్తా పత్రికలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సివిల్స్లో స్టాటిక్ పార్ట్ కంటే ఫ్యాక్చువల్ డేటాపై ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. టెస్టు సిరీస్లు :
2019 ప్రిలిమ్స్ కటాఫ్ మార్కులు :
ముఖ్య సమాచారం :ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: మార్చి 3,2020 పరీక్ష ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ప్రిలిమినరీ పరీక్ష తేదీ: మే 31, 2020 వయసు: కనిష్ట వయసు 21 ఏళ్లు కాగా, గరిష్ట వయసు 32 ఏళ్లు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో సడలింపు ఉంటుంది. పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి. పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://www.upsc.gov.in యుపిఎస్సి (UPSC) నిర్వహించే సివిల్స్ పరీక్షకు ఉత్తమ వ్యూహం మరియు పుస్తకాలు (Best Strategy And Books For UPSC Civils Exam)పాఠశాల రోజులలో మీరు 6 నుండి 12 వరకు NCERT పాఠ్యపుస్తకాలను చదివి ఉంటె మీరు చరిత్ర, సాంఘిక శాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రం కోసం అదనపు పుస్తకాలు చదవలసిన అవసరం లేదు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క (UPSCయుపిఎస్సి)సివిల్స్ ఎగ్జామ్స్ భారతదేశపు అత్యంత ప్రధాన పరీక్షలలో ఒకటి. ఇందులో ఉత్తిర్ణులైనవారు కేంద్ర ప్రభుత్వ సేవలకు అధికారులుగా నియమిoపబడతారు.
సివిల్స్ ఒక అవలోకనం: సవాళ్లు మరియు వాటిని పరిష్కరించడానికి వ్యూహాలు
భారతదేశం తన భౌతిక, ఆర్థిక మరియు భౌగోళిక రంగాలలో ఎలా అభివృద్ధి చెందిందనే దానిపై జ్ఞానం సంపాదించడానికి మీకు నిజమైన ఆసక్తి ఉంటే, మీ ఆసక్తికి ఉపయోగపడే పరీక్ష ఇది.
యుపిఎస్సి సివిల్స్ క్లియర్ చేయడానికి మొదటి అవసరం ప్రతి రంగం గురించి జ్ఞానం పొందడం. పరిశోధనాత్మక స్వభావం ఈ పరీక్షను క్లియర్ చేయడానికి కావలసిన గుణం.
![]() మీరు సివిల్స్ ను లక్ష్యంగా చేసుకుని, మీ తయారీని ఎక్కడ ప్రారంభించాలో అయోమయంలో ఉంటే, మీరు అనుసరించాల్సిన వ్యూహం మీరు సరైన పుస్తకాలను చదవటం. భారతదేశపు ప్రధాన పరీక్షలలో యుపిఎస్సి నిర్వహించే సివిల్స్ ఒకటి.
ఒకటిన్నర సంవత్సరాల సమయం లేదా సుమారు రెండు వందల రోజుల సమయం సివిల్స్ పరీక్ష యొక్క ప్రిలిమ్స్ స్టేజ్ మరియు మెయిన్స్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి సరిపోతుంది. అయితే మీరు సరైన మెటీరియల్ పొందగలగాలి.
మొదట, సివిల్స్ సిలబస్ గురించి మీకు సరైన అవగాహన అవసరం. సిలబస్ మరియు మీరు దృష్టి సారించాల్సిన టాపిక్స్/అంశాల గురించి బాగా అర్థం చేసుకోవడానికి సిలబస్ ను కనీసం మూడుసార్లు పరిశిలించండి. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ప్రతి పరీక్ష దాని సిలబస్పై మాత్రమే ఆధారపడి ఉంటుంది
ఏమి అధ్యయనం చేయాలి మరియు జ్ఞానం పొందటానికి మీరు ఏ పుస్తకాలు మరియు రచయితలను ఎంచుకోవాలి అనే ఆలోచనతో మీరు గందరగోళానికి గురైతే, యుపిఎస్సి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలో విజయం సాధించడానికి కొన్ని ఉత్తమ పుస్తకాల జాబితా ఇక్కడ ఉంది.
1. లక్ష్మీకాంత్ :“ఇండియన్ పాలిటీ Indian Polity”
ఎం. లక్ష్మీకాంత్ రచించిన “ఇండియన్ పాలిటీ Indian Polity”ని భారతదేశంలోని రాజకీయ సినారియో కి బైబిల్ అని కూడా పిలుస్తారు. భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఉత్తమమైన పుస్తకాల్లో ఒకటి. ఇది 800 పేజీలు ఉన్నప్పటికీ, భారత రాజకీయాలపై అన్ని ప్రశ్నలను అర్ధం చేసుకోవడానికి నిపుణులు రెండు లేదా మూడుసార్లు దిన్ని చదవమని సిఫార్సు చేస్తారు. ఇది చాలా పెద్దదిగా ఉంది, కాని సివిల్స్ పరీక్షకు చదవడం లో ఇంత విలువైనది మరే ఇతర పుస్తకం లేదు.
2. ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడరన్ ఇండియా: రాజీవ్ అహిర్, స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్
చాలా మంది సివిల్స్ రాసేవారు భారతదేశ చరిత్ర పుస్తకాలపై గందరగోళం చెందుతున్నారు. మార్కెట్లో ఉన్న టన్నుల కొద్దీ పుస్తకాలలో రాజీవ్ అహిర్ రాసిన మరియు స్పెక్ట్రమ్ ప్రచురించిన “ఆధునిక భారతదేశం యొక్క సంక్షిప్త చరిత్ర A brief history of Modern India” అనే పుస్తకం భారతదేశ చరిత్ర గురించి అత్యంత సంక్షిప్త సారంశాన్ని అందిస్తుంది.
అంతేకాక, మీకు సమయం ఉంటే, మీ భారతీయ చరిత్ర పై జ్ఞానాన్ని పెంచుకోవటానికి బిపాన్ చంద్ర రాసిన హిస్టరీ ఆఫ్ మోడరన్ ఇండియా కూడా చదవవచ్చు.
3. సర్టిఫికేట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ బై జిసి లియోంగ్
40 నుండి 50 సంవత్సరాల క్రితం వ్రాసినప్పటికీ, జిసి లియోంగిస్ రాసిన “సర్టిఫికేట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ” యుపిఎస్సి సివిల్స్ పరీక్ష కోసం తప్పక చదవాలి. ఇది మీకు గణనీయమైన సైద్ధాంతిక నేపథ్యాన్ని అందిస్తుంది. ప్రపంచంలోని భౌగోళిక భావనల గురించి బాగా అర్థం చేసుకోవడానికి పుస్తకం యొక్క మొదటి విభాగం చాలా ఉపయోగ పడుతుంది. మీ జ్ఞానాన్ని పెంచడానికి బ్లాక్ స్వాన్ లేదా ఆక్స్ఫర్డ్ అట్లాస్ కూడా ఉపయోగపడును..
4.ఎన్సిఇఆర్టి (NCERT) బుక్స్
పాఠశాల రోజుల లో అనగా 6 నుండి 12 వరకు NCERT పాఠ్యపుస్తకాలను చదవిన మీరు చరిత్ర, సాంఘిక శాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రం కోసం అదనపు పుస్తకాలు చదవలసిన అవసరం లేదు. ఎన్సిఇఆర్టి సిరీస్ అద్భుతంగా ఉంది.. మీ అవసరానికి అనుగుణంగా వీటిని ఒకటి లేదా రెండుసార్లు చదవండి.
5.కరెంట్ అఫైర్స్ Current Affairs
వార్తలను చదివే అలవాటును పెంచుకోండి; ఇది ప్రపంచవ్యాప్తంగా కరెంట్ అఫైర్స్/ప్రస్తుత వ్యవహారాల గురించి మీకు తెలియజేయడంలో సహాయపడటమే కాకుండా, మీ రచనా నైపుణ్యాలను (writing skills) బలోపేతం చేస్తుంది మరియు మీ ఆలోచనా సామర్థ్యo అభివృద్ధి చెందడంలో మీకు సహాయపడుతుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ది హిందూ, బిబిసి, ఇండియన్ ఎక్స్ప్రెస్ అత్యంత సిఫార్సు చేయబడిన మరియు నమ్మదగిన వనరులు. మీ పరిధులను విస్తృతం చేయడానికి మరియు మీ భాష పటిమను పెంచడానికి ప్రముఖ రచయితల పుస్తకాలు విశ్రాంతి సమయం లో చదవండి. మీ వ్యాస రచన నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఆర్టికల్స్ చదవండి, తద్వారా మీరు మీ ఆలోచనలను స్పష్టంగా మరియు సమగ్రంగా వ్యక్తపరచ వచ్చు
6. పాత పేపర్స్ ప్రాక్టీస్ Practice Papers చేయండి
తరచు అడిగే ప్రశ్నలను గుర్తించడానికి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ యొక్క మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలను పొందండి. వీటిని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు మీ సమయ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఆన్లైన్ పరీక్షలు తోడ్పడుతాయి.
|
google.com, pub-9453835310745500, DIRECT, f08c47fec0942fa0
You must log in to post a comment.